చెన్నై, జనవరి 20 : లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్సభ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నిర్ణయించారు. ఏప్రిల్ 14 తమిళ సంవత్సరాది రోజున తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ నుంచి చెన్నై వరకు 117 రోజులు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడ్రోజులు రోజుకు 20 నుంచి 28 కి. మేర ప్రయాణం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.