Take a fresh look at your lifestyle.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జి ఇక లేరు

నిస్వార్థ రాజకీయాలకు ఆదర్శప్రాయులు
భద్రాచలం: నీతి నిజాయితీకి మారు పేరు తన జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాసనసభలో తన గొంతుకను వినిపించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే బుజ్జి ఇక లేరు. గత కొద్ది రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న బుజ్జి హైదరాబాదులోని ఒక ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇ మెరుగుపడక పోవడంతో భద్రాచలం పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు .

సోమవారం నాడు కుంజా బుజ్జి తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని భద్రాచలం పట్టణ ప్రజల సందర్శనార్థం పట్టణ సిపిఎం కార్యాలయం వద్ద అ ఉంచారు. పట్టణంలోని ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మూడు సార్లు భద్రాచలం ఎమ్మెల్యే గా గెలిచి గిరిజనులకు అనేక సేవలందించారని పలువురు కొనియాడారు.

Leave a Reply