Take a fresh look at your lifestyle.

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

వనపర్తి,సెప్టెంబర్‌,11 (‌ప్రజాతంత్ర విలేకరి) : కొత్తకోట మండలంలోని వివిధ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డు లభించడంతో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు జి.మధుసుదన్‌రెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ లక్ష్మీ అప్పరాల, దేవన్న రాయినిపేట, రమేష్‌గౌడ్‌, ఉత్తమ ఉపాధ్యాయులను ఆ గ్రామాల్లో స్కూల్‌కు వెళ్లి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మహిళా ఉపాధ్యాయురాలును రాయినిపేట ఎంపిటిసి ఎద్దుల రాదమ్మ, అప్పరాల ఎంపిటిసి చిట్టెమ్మ, ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలిచి ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ప్రధాన భూమిక పోషించారని ఇలాంటి సత్కారాలు ఉపాధ్యాయులకు వారి జీవితానికి సార్థకత లభించినట్లు అవుతుందన్నారు. సన్మాన కార్యక్రమానికి కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి నరేందర్‌ ‌రెడ్డి సీనియర్‌ ‌నాయకులు గొల్ల బాబన్న మాజీ సర్పంచు మాసన్న, మోహన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply