Take a fresh look at your lifestyle.

కొరోనా పేషెంట్లకు 3గంటల్లో బెడ్‌ ‌కేటాయించాలి

  • ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ధరల  పట్టికను ప్రచురించాలి
  • దోపిడీ చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు
  • కోవిడ్‌ ‌గ్రీవెన్స్‌ల కోసం 1902 నెంబర్‌ను కేటాయించాలి
  • 104 కాల్‌ ‌సెంటర్‌ ‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలి
  • వ్యాక్సినేషన్‌ ‌పక్రియ చురుకుగా సాగాలి
  • ఉన్నతస్థాయి సవి•క్షలో సిఎం జగన్‌ ఆదేశాలు

కోవిడ్‌ ‌పేషెంట్లకు 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ ‌కేటాయించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కోవిడ్‌ ‌కిట్‌ అం‌దించి వారిని నిత్యం ఫాలో అప్‌ ‌చేయాలని సూచించారు. బుధవారం ఒక్కరోజే 6.21 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించారని తెలిపారు. మరిన్ని వ్యాక్సిన్‌ ‌డోసుల కోసం అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తామని సీఎం వెల్లడించారు. కోవిడ్‌ ‌గ్రీవెన్స్‌ల కోసం 1902 నెంబర్‌ను కేటాయించాలని అధికారులకు సూచించారు. కోవిడ్‌, ‌వ్యాక్సినేషన్ల పక్రియపై సీఎం జగన్‌ ‌సవి•క్ష నిర్వహించారు. 104 కాల్‌ ‌సెంటర్‌ ‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌లో పేషెంట్లను దోపిడీ చేయకుండా చికిత్సకు కచ్చితమైన ధరను డిస్‌ ‌ప్లేలో పొందుపర్చాలని కోరారు. కోవిడ్‌ ‌టాబ్లెట్స్, ఇం‌జెక్షన్ల రేట్లను కూడా డిస్‌ప్లేలో చూపేలా ప్రదర్శన ఉండాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 6.03 శాతం కోవిడ్‌ ‌పాజివిటీ రేటు ఉందని సీఎంకు అధికారులు వివరించారు. 108 ఆస్పత్రుల్లో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. బుధవారం వరకు ఏపీలో 22,637 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించామని, ఇక ముందు కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు. వాల్టి నుంచి 104 కాల్‌ ‌సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. ఎవరికైనా చికిత్స, బెడ్‌ ‌కావాలంటే ఆ కాల్‌ ‌సెంటర్‌ ‌ద్వారా సేవలందించాలి. హోం ఐసోలేషన్‌, ‌కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ ‌లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలి. అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం‌ల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలి. హోం ఐసొలేషన్‌లో కూడా వారిని ఫాలో అప్‌ ‌చేయాలి. రోగి ఫోన్‌ ‌చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ ‌సమకూర్చాలన్నారు. 104 నెంబరు కోవిడ్‌ ‌సేవల కోసం, 1902 నెంబరు గ్రీవెన్సుల కోసం కేటాయించండి. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి. కోవిడ్‌కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్‌ ‌చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి. అందుకు అవసరమైన ప్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ ‌వంటి పబ్లిక్‌ ‌ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి. కోవిడ్‌ ‌పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్‌, ‌శానిటేషన్‌, ‌క్వాలిటీ ఆఫ్‌ ‌ఫుడ్‌ ‌వరకు.. ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఒకవేళ రోగి ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలనుకుంటే, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా, వాటిని కూడా స్పష్టంగా నిర్దేశిరచండి. రోగులకు ఎక్కడా బెడ్ల కొరత ఉండకూడదు. అందువల్ల ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలు కూడా అధికారుల దగ్గర ఉండాలి. ఆస్పత్రులలో చికిత్స ఫీజులు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్ధమయ్యేలా ప్రదర్శించాలన్నారు.  ఎక్కడైనా అధిక ఫీజులు, ఛార్జీలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలి.

ఆస్పత్రి కేర్‌, ‌శానిటేషన్‌, ‌నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్‌ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలి. క్వాలిటీ ఆఫ్‌ ‌మెడికేషన్‌తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది కూడా చాలా ముఖ్యం. అన్ని ఆస్పత్రులలో ఇవన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలి. అందుకోసం ఆస్పత్రులలో వాటిని పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. జిల్లాలలో కూడా ఆ ఏర్పాటు జరగాలన్నారు. టెస్టింగ్‌ ‌చాలా ముఖ్యం. కోవిడ్‌ ‌పేషెంట్‌ ‌ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో కూడా పరీక్షలు చేయాలి. పరీక్ష చేయించాలనుకున్న ఎవరైనా వెళ్లి, దాన్ని చేసుకునే విధంగా ప్రతి పీహెచ్‌సీలో తగిన ఏర్పాటు చేయాలి. ఇంకా 104కు ఎవరైనా ఫోన్‌ ‌చేసి, తాము పరీక్ష చేయించుకోవాలని అనుకుంటున్నామని చెబితే, వారు ఎక్కడికి పోవాలన్నది గైడ్‌ ‌చేయాలి. అందువల్ల పీహెచ్‌సీ, సబ్‌ ‌సెంటర్‌ ‌లేదా విలేజ్‌ ‌క్లినిక్‌.. ఎక్కడైనా సరే పరీక్ష చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మన ఫోకస్‌ ఏరియా వాక్సినేషన్‌. ‌వీలైనంత త్వరగా ఈ పక్రియ ముగించాలి. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్దంగా చేయాలి. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ ‌వేయాలి. వాక్సిన్‌ ‌వేయడం మనకు చాలా ముఖ్యం. హెల్త్‌కేర్‌ ‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లందరికీ తప్పనిసరిగా వాక్సిన్‌ ‌వేయాలి. ఒక్కరు కూడా మిగలొద్దు. మనం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా, కచ్చితంగా ఇంకా కొన్ని రోజులు రోజుకు 6 లక్షల వాక్సిన్లు వేయాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్‌గా మానిటర్‌ ‌చేయాలి. అందుకు తగిన ప్రొటోకాల్‌ ‌రూపొందించుకోండి. తరుచూ సందర్శించడం వంటివి చేయాలి. అదే విధంగా వారికి ఏడు రకాల ట్యా•-లబెట్లు, క్యాప్సల్స్‌తో కూడిన కోవిడ్‌ ‌కిట్‌ ‌తప్పనిసరిగా అందించాలి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ‌సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి. విశాఖలో ప్రొడక్షన్‌ ‌సెంటర్‌ ‌నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూసి, దాన్ని అన్ని 108 ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ ఉం‌డేలా చూడండి. అదే విధంగా రెమ్‌డెస్‌విర్‌ ఇం‌జక్షన్లు. రోగులకు అవసరమైన ఇంజక్షన్లు అన్ని చోట్ల అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంజక్షన్‌ ‌లేకుండా ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా చూడాలి అని సీఎం జగన్‌ ఆదేశించారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌, ‌వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ ‌సింఘాల్‌, ‌కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ‌కాటమనేని భాస్కర్‌, ‌రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, మున్సిపల్‌ ‌శాఖ స్పెషల్‌ ‌సీఎస్‌ ‌వై.శ్రీలక్ష్మి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ ‌సీఎస్‌ ‌సతీష్‌చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పాఠశాల విద్య శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.‌మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సవి•క్షకు హాజరయ్యారు.

Leave a Reply