జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు అడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి సీఎం కేసీఆర్ మద్దతు పలికారా లేదా? అని సూటిగా ప్రశ్నించారు.
బండి సంజయ్కు రాజకీయ అవగాహన లేదని స్పష్టంగా అర్థం అవుతుందని, కరీంనగర్లో చిల్లర కార్పొరేటర్గా గెలిచిన ఆయన ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని విమర్శించారు. బండి సంజయ్కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా సరిగా తెలియదని, అలాంటి వ్యక్తికి ప్రెసిడెంట్ ఇస్తే ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యారు.