తండ్రి అధికారన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదన
తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ పార్లమెంటులో ప్లకార్డుల ప్రదర్శన
అన్నీ మరచి ఇవాళ తెలంగాణ సిఎం కెసిఆర్పై విమర్శలు
మరోమారు దోచుకోవడానికి వస్తున్న సీమాంధ్రులు
డియా సమావేశంలో మండిపడ్డ బాల్క సుమన్
హైదరాబాద్,నవంబర్30: ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. షర్మిల కుటుంబం తెలంగాణ వ్యతిరేక కుటుంబమన్నారు. రాష్టాన్రికి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్కు వెళ్లాలంటే వీసా తీసుకొని పోవాలని అన్నారని, గతంలో షర్మిల ’హైదరాబాద్లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్లో బతికినట్లు’ అనే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అవన్నీ మరచి ఇప్పుడు మరోమారు తెలంగాణపైనా, సిఎం కెసిఆర్పైనా విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎల్పీలో బుధవారం డియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించారని బాల్క సుమన్ తెలిపారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని షర్మిల సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతున్నారని, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచందర్ రావు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన తెలిపారన్నారు.
తెలంగాణ వ్యతిరేకులు రాష్టాన్రి ఏం చేస్తారని ప్రశ్నించారు. షర్మిల మాట్లాడే భాష సంస్కార హీనంగా ఉందని, ఆమె మాట్లాడే భాష ఆడబిడ్డ మాట్లాడే విధంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. చెన్నూరులో షర్మిల తనపై వ్యతిరేకంగా మాట్లాడితే.. తాను కార్యకర్తలను సముదాయించినట్లు బాల్క సుమన్ తెలిపారు. వైఎస్ కుటుంబంపై తెలంగాణ ప్రజల్లో కోపం ఉందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని, షర్మిల తన భాష మార్చుకోకపోతే ఏమైనా అయితే మాకు సంబంధం లేదన్నారు. అసలు దొంగలు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసునని, కృష్ణా, గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించింది ఎవరో తెలుసునని చెప్పారు. షర్మిలకు తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, కిరాయి మనుషుల తోలుబొమ్మల ఆటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ వనరులను దోచుకున్న ఘనత వైఎస్ కుటుంబానిదని, నాడు మానుకోటలో జగన్ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను షర్మిల మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గవర్నర్కు కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు గుర్తు లేదా? ప్రభుత్వ విప్ నిలదీశారు. తెలంగాణను మరోమారు దోచుకోవడానికే వీరంతా బయలుదేరారని మండిపడ్డారు.