డెహ్రాడూన్, ఏప్రిల్ 27 : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్ధామ్ యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్ చేశారు. ఆర్మీ బ్యాండ్, జై బద్రీ జయజయధ్వానాల మధ్య ఆలయాన్ని తెరిచారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.