‘‘ఏప్రిల్ 14 చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయిన, నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచన పరులే. సమాజ హితం కోసం అడుగు అడుగున పోరాడిన వీర యోధులే.. ప్రతి సంవత్సరం ఈరోజు నాకు ఒక సంఘర్షణను రేపుతోంది. ఒక సామాజిక విప్లవకారునీ జననం, మరొక విప్లవకారుడు నేలకొరిగిన రోజు. ఒకరిదిపుట్టుక, ఒకరిది చావు… ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? సమీకరించు, బోధించు ,పోరాడు అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు,జీనా హైతో మర్ నా సీఖో కదం కదం పర్ లడ్నా సీఖో అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు…’’
ఒక ధ్రువతార వికసించిన రోజు, ఒక అరుణతార రాలిపోయిన రోజు..
తండ సదానందం
టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మహబూబాబాద్.