అమరావతి,జూన్ 17 : ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం సభ ప్రారంభమైంది. సమావేశాలు మొదలు కాగానే సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. మొదట బడ్జెట్పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది.
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు. మొదట బడ్జెట్పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని షరీఫ్ పేర్కొన్నారు. అలాగే ఆంధప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ల శివారెడ్డి, వై. రాజారామచంద్రల మృతికి సభలో సంతాపం తెలియజేశారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు శాఖల డిమాండ్లను ప్రవేశపెట్టారు.