అమరావతి,ఆగస్ట్ 10 : ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. కార్యక్రమంలో ఎపిఐఐసి ఛైర్పర్స్ రోజా కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపంగా దీనిని రూపొందించారు. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు.
పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం..పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించ నున్నారు.సూక్ష్మ,చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత,మౌలిక సదుపా యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్టాన్రిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబ డులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజె క్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగు ణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి.