- సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో విభజన అంశాలు
- సన్నాహక సమావేశంలో పలు అంశాలను చర్చించిన సిఎం జగన్
- దీనికి సంబంధించి ప్రిపేర్ కావాలని అధికారులకు సూచన
అమరావతి, నవంబర్ 3 : ప్రత్యేకహోదా సహా పోలవరం తదితర పెండింగ్ సమస్యలపై మరోమారు ఎపి సర్కార్ ఫోకస్ పెట్టింది. విభజన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకుని వెల్లేందుకు కసరత్తు చేస్తోంది. ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, కర్నాటక రాష్టాల్ర సీఎంలు పాల్గొననున్నారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్టేట్రర్, అండమాన్ నికోబార్ లెప్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానిక హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. సదరన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.
రాష్టాన్రికి సంబంధించిన పలు కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావనకు వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంతో మేలు జరిగే ఛాన్స్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను సదరన్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టు రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి రావాల్సిన బకాయిలు, ఏపీ రెవెన్యూ లోటుపై చర్చించాలని సీఎం జగన్ అన్నారు. రేషన్ బియ్యం కేటాయింపుల్లో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన సివిల్ సప్లై బకాయిలపై సదరన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ముఖ్యంగా రాష్టాన్రికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. కృష్ణ రివర్ బోర్డు పరిధిలోకి జురాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని ప్రస్తావించాని సీఎం జగన్ అన్నారు. నదుల అనుసంధానికి సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనల ద సమావేశంలో చర్చించారు. సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఇతర రాష్టాల్రు ప్రస్తావించే అంశాల్లో రాష్టాన్రికి సంబంధించి విషయాలు ఉండే అవకాశం ఉంది. అయితే వీటిపై తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్టాన్రికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఎఫ్డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్క•త అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్ బియ్యంలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.