- ఇంత జరుగుతున్నా పట్టించుకోరేం…
- కూలగొట్టి కడతామన్న హా ఏమైంది?
- కొరోనాపై సర్కార్ చేతులెత్తేసింది : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- ఉస్మానియా హాస్పిటల్ను సందర్శించిన బిజెపి బృందం
ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓ వైపు కరోనా బాధితుల తాకిడి.. మరో వైపు మురుగునీటితో ఉస్మానియా హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈనేపథ్యంలో భాజపా నేత రామచంద్రరావు తదితరులతో కలిసి బండి సంజయ్ గురువారం ఉస్మానియా హాస్పిటల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీస వసతులపై నోరు విప్పడం లేదన్నారు. ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ శిథిలావస్థకు చేరిన హాస్పిటళ్లపై లేదని విమర్శించారు. హాస్పిటళ్లలో డీపీఆర్లు ఉండవు కాబట్టి ముఖ్యమంత్రి ఇటువైపు దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. కొర్పొరేట్ హాస్పిటళ్లలో దోపిడీని అరిక ట్టడంలో సీఎం విఫలమ య్యా రన్నారు. కొరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అడిగితే కనీసం స్పందించలేదన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కూలే స్థితిలో ఉందని …వెంటనే సీఎం హాస్పిటల్ను సందర్శించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ అభివృద్ధిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని బండి సంజయ్ అన్నారు. వానపడితే ఉస్మానియా హాస్పిటల్ చెరువుగా మారిందన్నారు. ప్రభుత్వం ఎన్ని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజలకు నమ్మకం కలగడంలేదు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత ఉందంటూ పదేపదే ఆరోపణలు వస్తున్న తరుణంలో నిన్న గాంధీ హాస్పిటల్లో ఒకరు మృతి చెందారు.
ఆక్సిజన్ పెట్టనందునే అతను చనిపోయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో కోవిడ్ పేషెంట్లకు గాంధీలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నిన్న గాంధీలో ఆక్సిజన్ అందక ఒకరు మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. ఉస్మానియాను పునర్నిర్మిస్తానని చెప్పి కెసిఆర్ మాటతప్పారని బండి సంజయ్ అన్నారు. సోషల్ డియాలో హాట్ టాపిక్గా ఉస్మానియా హాస్పిటల్ చక్కర్లు కొట్టినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంత జరుగుతున్న ఎవరు పటించుకోవడం లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి సోయి లేదు. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం ఫామ్ హౌజ్ కి పరిమితం అయ్యాడు. కార్పొరేట్ హాస్పిటళ్లలో కొరోనా వైద్యానికి లక్షలు దండుకుంటున్నారు.. శవాల ద పైసలు ఏరుకుంటున్నారు. ఆ ఖర్చు తట్టుకోలేక ప్రభుత్వ హాస్పిటళ్లకు ఒక రోగంతో వెళ్తే… అక్కడి నుండి మరో పది రోగాలు వెంటబెట్టుకొని రావాల్సి వస్తోంది. ఇంతక ముందు ఉస్మానియాని కూలగొట్టి కొత్తగా కడతాను అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. పైగా బీజేపీ కేసులు వేసి అడ్డుకుంది అంటున్నారు. మరి కాళేశ్వరం, సెక్రటేరియట్ విషయాల్లో కూడా కేసులు వేశాం. మరి వాటిని ఎలా కట్టారు అని సంజయ్ ప్రశ్నించారు.