పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇంద్రవెళ్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.
కేసీఆర్ మాయమాటలు చెప్పి దళిత గిరిజనుల వోట్లు దండుకుంటున్నారని భట్టి ఆరోపించారు. ఇప్పుడు దళితబంధు పేరుతో మరో మోసానికి తెరలేపాడని విమర్శించారు. ఉపఎన్నిక జరిగే హుజూరాబాద్కే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధును అమలుచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.