గచ్చిబౌలిలో కిడ్నాప్… సంగారెడ్డిలో హత్య
వారే హత్య చేయించారు: హేమంత్ భార్య
ప్రణయ్ హత్య మరువకముందే రాష్ట్రంలో మరో పరువు హత్య సంఘటన చోటు చేసుకోవడంతో సంచలనం సృష్టించింది.ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చందానగర్కు చెందిన హేమంత్ అతని ఇంటికి సమీపంలో ఉండే ఓ యువతిని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈవిషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో గతేడాది నవంబర్ నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 10వ తేదీన యువతి ఇంటి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ కలిసి బీహెచ్ ఈఎల్ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు,
బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. యువతి తల్లి దండ్రులకు ఇష్టంలేకపోవడంతో యువజంట గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటోంది. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో యువతి బావలు, వదినలు, మామయ్యలు, మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. మార్గ మధ్యలో హేమంత్ భార్య కారులోంచి దూకేసి తప్పించుకుంది.హేమంత్ను కొట్టుకుంటూ కారులోనే తీసుకెళ్లారు. ఈవిషయాన్ని హేమంత్ ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు గచ్చిబౌలి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ఆచూకీ తెలియలేదు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు.

లిసంగారెడ్డిలో శవమై తేలిన వైనం
శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్ శవమై కనిపించాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడ్ని దారుణంగా చంపేశారని హేమంత్ తల్లి బోరున విలపించారు. వేర్వేరు కులాలు అయినందు వల్లే తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారే హత్య చేయించారు: హేమంత్ భార్య అవంతిలి
‘‘హేమంత్ నేనూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. జూన్ 10న వివాహం చేసుకున్నాం. పెళ్లి తర్వాత చందానగర్ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్కు వెళ్లాం. అప్పటి నుంచి వారికి దూరంగా గచ్చిబౌలిలో ఉంటున్నాం. మా నాన్నకు ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది నేను. మా బావలు, వదినలు, మామయ్యలు, ఇద్దరు రౌడీలు నిన్న సాయంత్రం మూడు కార్లలో వచ్చి మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లారు. నేను మధ్యలో కారులోంచి దూకేసి తప్పించుకున్నారు. హేమంత్ను రౌడీలు కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లారు. నిందితులు కొల్లూరులో ఓఆర్ఆర్ ఎక్కి పటాన్ చెరులో దిగారు. మా బావలు, వదినలు, మామయ్యలే ఈ హత్య చేయించారు’’ అని హేమంత్ భార్య మీడియాకు వెల్లడించారు.
హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్టు పరువు హత్య కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జీ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి హేమంత్కు ఉరేసి చంపినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు.హైదరాబాద్ చందానగర్లో నివాసం ఉంటున్న హేమంత్ అదే ప్రాంతానికి చెందిన అవంతిని ఇంట్లో వారిని ఎదిరించి నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటికి గురువారం మధ్యాహ్నం అవంతి తల్లిదండ్రులు వారి బంధువులు మూడు కార్లలో వచ్చారని మాదాపూర్ ఇంచార్జీ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. హేమంత్, అవంతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అవంతి తప్పించుకోగా.. హేమంత్ను కారులో తీసుకెళ్లారని చెప్పారు.హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచామిచ్చారని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగతావారు హేమంత్ను మరో కారులో తీసుకెళ్లారన్నారు. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డిని షామీర్పేట్లో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సంగారెడ్డి దగ్గర హేమంత్ను ఉరేసి హత్య చేసినట్లు ఒప్పకున్నాడని డీసీపీ వెల్లడించారు.