వసతుల కల్పనకు పెద్దపీట
ప్రాధాన్యతా క్రమంలో పనుల పూర్తి
అమరావతి, ఏప్రిల్ 20 : రాష్ట్రంలోని అంగన్వాడీలలో కనీస వసతులు కల్పించాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో సక్ష నిర్వహించారు. ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన 10 వేలకు పైగా అంగన్వాడీల్లో పనులపై సీఎంకు అధికారులు వివరించారు. 45వేల అంగన్వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించారు. గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖాలీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సంపూర్ణపోషణ కింద పంపిణీ పక్రియకు సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలని తెలిపారు. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలని చెప్పారు. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సంపూర్ణపోషణ కింద పంపిణీ పక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్న సీఎం. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్నారు. క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలన్న సీఎం.? ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్న సీఎం. ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వీ వీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లై•స్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండియన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.