- విద్యార్థుల చదువుతోనే సమాజంలో మార్పు
- చదువులో సమానత్వమే లక్ష్యంగా ట్యాబ్ల పంపిణీ
- యడవల్లి జడ్పీ పాఠశాలలో ప్రారంభించిన సిఎం జగన్
- ఇంగ్లీష్ డియం చదువులను అడ్డుకుంటున్నారని మండిపాటు
బాపట్ల, డిసెంబర్ 21 : ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవం మొదలైంది. చదువులు అంటే ప్రభుత్వానికి ఖర్చు కాదు.. అదో గురుతర బాధ్యత అని జగన్ సర్కార్ ప్రకటించింది. పిల్లలను చదువే గొప్ప ఆస్తిగా భావించి.. నాణ్యమైన చదువులు అందించే పాఠశాలలను సరికొత్తగా రూపుదిద్దుతోంది. ఇది భావితరాల ఉజ్వల భవితకు బాటలుగా భావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు నాడే విద్యార్థుల బంగారు భవితకు పునాదులు వేసే ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని జెడ్పీ పాఠశాలలో ట్యాబ్ల పంపిణీని సిఎం జగన్ ప్రారంభించారు. చదువుతోనే విద్యార్థుల తలరాత మారుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. చదువులో సమానత్వం ఉంటే ప్రతి కుటుంబం అభివృద్ధిని అందుకోగలదని ఆకాంక్షించారు. ఇంగ్లీష్ వద్దని కోర్టులకు వెళ్లే దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ డియం, డిజిటల్ విద్యఅందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసిందన్నారు.
అందుకే ఆ పెత్తందారీ భావాలను బద్దలు కొడుతూ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో అందించనున్న ఈ ట్యాబ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసింది. 2019 నుంచి పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల హోస్ట్లో భాగంగా ట్యాబ్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్బంగా సిఎం అన్నారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలని.. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ డియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధ వేసింది అన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఇంగ్లీష్ డియం చదవులు అందకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకునే దౌర్భాగ్య పరిస్థితుల్ని చూశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు స్థూల నమోదు నిష్పత్తి పెంచడానికి, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం తోడ్పడుతోంది అన్నారు సీఎం జగన్.
అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరగా అమ్మఒడి పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 19,617.6 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించేలా వరల్డ్ క్లాస్ విద్యా బోధన అందించేలా రూ. 3,669 కోట్లను స్కూళ్లలో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ’మన బడి నాడు-నేడు’ కార్యక్రమం మొదటి దశ కింద 15,715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన పూర్తయ్యిందన్నారు. మరో రూ. 8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టామన్నారు. మొత్తం మన బడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వం రూ. 1,237.95 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన ఆహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ’జగనన్న గోరుముద్ధ’ పథకం కింద మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేస్తోంది. మెనూలో భాగంగా వారానికి ఐదు గుడ్లు, మూడు చిక్కిలు విద్యార్థులకు అందిస్తున్నారు. డైలీ అలవెన్స్ కంటే అధిక పోషక విలువలు కలిగిన దాదాపు 15 రకాల వస్తువులను అందించడం కోసం ఏడాదికి రూ. 1,800 కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యా కానుక పథకం కింద ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు అందజేస్తోంది.
ఒక్కో కిట్లో స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, ఒక జత షూ, స్టిచింగ్ ఛార్జ్, బెల్ట్, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 45 లక్షల మంది విద్యార్థులకు కిట్ల కోసం రూ.2,323.99 కోట్లు ఖర్చు చేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యా విధానంలో అనేక సంస్కరణలను అమలు చేసింది జగన్ సర్కార్. 1 నుంచి 8 వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలు భవిష్యత్తులో విద్యార్థులను ఇంగ్లీష్ డియంలోకి పూర్తి స్థాయిలో తెచ్చేలా ద్విభాషాపరంగా రూపొందించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరవుతు న్నందున విద్యార్థులందరికీ, ముఖ్యంగా ప్రస్తుతం 8వ తరగతిలో ఉన్న వారికి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తోంది. 8వ తరగతి నుంచి ఔఅఇఖి సిలబస్ తో రూపొందించిన పాఠ్య పుస్తకాలను ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు కంటెంట్తో అందిస్తున్నారు.
అలాగే జాతీయ విద్యా విధానం సిఫార్సుల ప్రకారం 3వ తరగతి నుంచి.. అన్ని తరగతులకు అర్హత కలిగిన స్జబెక్ట్ ఉపాధ్యాయులను అందించడానికి పరిపాలనా సంస్కరణ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలను 5:3:3:4 నమూనాలో ఆరు రకాలుగా వర్గీకరించారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ఉపాధ్యాయుల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ విద్యా రంగంలో పరివర్తనాత్మక మార్పును తేనుంది ప్రభుత్వం. దీని కోసం రాష్టాల్రు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే కామన్ గ్రేడింగ్ సిస్టమ్ అమలు నాణ్యతను మరింత పెంచనుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో 2017-18లో ఆంధ్రప్రదేశ్ మొత్తం స్కోరు 728. 2020-21లో 902 స్కోరు సాధించి దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ట్యాబ్లను కూడా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స తదితరులు పాల్గొన్నారు.