అనకాపల్లి, జనవరి 31 : ఓ ఫార్మా కంపెనీలో రియాకర్ట పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఈ ప్రమాదం సంభవించింది.లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.