సీ జోన్లో ఉన్న ప్రజలకు వైద్య సదుపాయం: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు.

సీ జోన్ లో నివసించే ప్రజలకు మెడికల్ సదుపాయం కల్పిస్తున్నట్లు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. ఈ వైద్య సదుపాయం ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం  12:00 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరైనా ప్రజలకు ప్రథమ చికిత్సలు అవసరమైనచో చేయించుకోవాలన్నారు.

వెంకటేశ్వర కాలనీ, అయ్యప్ప కాలనీ,శివరాంనగర్ కాలనీ, కజన్సీ బాగ్,ఆలంపల్లీ లోని  కంటైన్మెంట్ ఏరియా లోని ప్రజలందరికీ  తెలియజేయునది ఏమనగా తమ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అత్యవసర  చికిత్స  అవసరమైనచో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీసు ప్రక్కన గల జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలికల) నందు ప్రథమ చికిత్స  చేయుటకు డాక్టర్లు     ఉదయం 9:00 గం నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కావున ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు…..ఫోటోరైటప్… వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు.

Comments (0)
Add Comment