చక్రబంధంలో చేనేత కార్మికులు

నేడు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
ప్రారంభం 2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్స వంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు… భారత స్వాతంత్య్రోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతర ంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగింది.

ఈ మద్య వచ్చిన మల్లేశం సినిమా మీరు చూసివుంటే, ఒకప్పుడు చేనేత కార్మికుల జీవితాలు ఎలా వుండేవో మనకు తెలుస్తుంది. వారి శ్రమకు ఫలితం దక్కాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని వివిధ రాష్ట్రాల్లోని చేనేత సేవా కేంద్రాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా దేశంలోని చేనేత చేనేత కార్మికులను గౌరవించటానికి మరియు భారతదేశం యొక్క చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచటానికి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపు కుంటాం,బ్రిటిష్‌ ‌ప్రభుత్వం బెంగాల్‌ ‌విభజనకు నిరసనగా 1905 లో కలకత్తా టౌన్‌ ‌హాల్‌లో ఈ రోజు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7 తేదీని జాతీయ చేనేత దినంగా ఎంచుకున్నారు. ఈ ఉద్యమం దేశీయ ఉత్పత్తులు మరియు ఉత్పత్తి ప్రక్రియలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మనం కూడా వీలైనంత వరకు చేనేత బట్టలను ఉపోయోగించాలి.

అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు లేక బతుకు చిరిగిన వస్త్రమైంది. మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి. ప్రభుత్వం కరుణించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని వారు వేడుకుంటున్నారు. మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా కార్మికుల ఆకలి తీరడం లేదు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చేనేత స్థానంలో మరమగ్గాలు, ఆధునిక మగ్గాలు వచ్చినా.. శ్రమించే చేతులకు మిగిలేది శూన్యం.

కొరోనా సమయంలో గడ్డు కాలం…
ఇప్పటికే దారుణ పరిస్థితుల్లో ఉన్న వృత్తులను లాక్‌ ‌డౌన్‌ ‌మరింత ప్రమా దంలోకి తోసింది. చేనేత, మరనేత రంగాలు ఇప్పుడు ఇదే ఇబ్బందుల్లో ఉన్నాయి. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల బట్టల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. లాక్‌ ‌డౌన్‌ ‌తరువాత కూడా పాత వేగంతో ముందుకెళుతుందన్న భరోసా లేదు. దీని ప్రభావం నేత కార్మికులపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నేత కార్మికులుగా పిలుస్తున్న వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చేతితో మగ్గంపై నేతనేసే వారు, చేనేత కార్మికులు. రెండోవారు, కరెంటు మెషీన్ల మీద నేతనేసేవారు. వీరినే మరనేత కార్మికులు అంటున్నారు. లాక్‌ ‌డౌన్‌ ఇప్పుడు ఇద్దర్నీ ఇబ్బంది పెడుతోంది. పెళ్లిళ్ల సీజన్లు, రెగ్యులర్‌గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయి. తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే. ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరకు ఉన్నంత వరకూ పనిచేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల మహారాష్ట్ర, గుజరాత్‌, ‌తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే ముడి సరకు ఆగిపోయింది. దీంతో పని ఆపేయాల్సి వచ్చింది. మిగతా వారిలా కాకుండా, పని ఆగిపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి, కొనుగోలు లేకపోతే వీరికి రోజు గడవడమే ఇబ్బంది అయిపోతుంది.

నేతన్నల ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనాలి
1924లో గాంధీ ఒక చోట మాట్లాడుతూ ‘’ దేశంలో మన వస్త్ర అవసరాలన్నిటినీ మిల్లు ద్వారా తయారైన వస్త్రాల ద్వారా కాకుండా చేతితో వడికే నూలు పరిశ్రమ నుంచి, చేనేత పరిశ్రమ నుంచీ భర్తీ చేసుకోవాలి’ అని భ్రోధించారు.అయితే, స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలు పెట్టుబడిదారీ కేంద్రంగా ఉండటంతో చేనేత పరిశ్రమ అట్టడుగు నేత కార్మికుల చేతిలో నుంచి సంపన్న వర్గాల కనుసన్నలలో నడిచే స్థితికి నెట్టబడింది. ఇదే సమయంలో మన దేశ ప్రభుత్వాలు భారతీయ చరిత్ర, వారసత్వం, సంస్కృతిలో చేనేత పరిశ్రమ గొప్పతనం చాటుతూనే చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవుతున్నాయి. వినియోగదారుల అభిరుచులకు తగిన రీతిలో వస్త్రోత్పత్తులు చేయడంలో నేతన్నలు నైపుణ్యాలు పెంచుకోవాలని చెబుతూనే విదేశీ అతిధులకు బహుమతులుగా చేనేత వస్త్రాలను అందించడం ప్రభుత్వాల ద్వంద వైఖరికి నిదర్శనం.నేతన్నను అదుకొని ప్రభుత్వాలే ,నేరుగా చేనేత వస్త్రాలు కోనుగోలు చేసి , వారిని అభివృధి పదంలో వెళ్ళుటకు ప్రోత్సహించాలి……
చేనేత వస్త్రాల్ని దరిద్దాం…
నేతన్నకు అండగా ఉందాం….
– జాజుల దినేష్‌, ‌పొలిటికల్‌ ‌సైన్స్ ‌లెక్చరర్‌,
‌నల్గొండ జిల్లా, 9666238266

huzurabad updatesNithyanand Royolympics 2021prajatantra newstelugu entertainmenttelugu stories
Comments (0)
Add Comment