ఈ ‌దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

లక్ష్మీ నారాయణుని అనుగ్రహం అందరిపై ఉండాలి
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, నవంబర్‌ 3(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీకటిని పారదోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. చిన్నపిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అందరికి శుభం చేకూరాలని, సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి హరీష్‌రావు కోరుకున్నారు.

Comments (0)
Add Comment