సాదాసీదాగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

జిల్లాలకు ఇన్‌ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్‌లో కెసిఆర్‌, ‌సిరిసిల్లలో కెటిఆర్‌ ‌జెండా, సిద్దిపేట లో మంత్రి హరీష్‌ ‌రావు ఆవిష్కరణ
‌జూన్‌ 2‌న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. కొరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించబోతున్నారు. కొరోనా నిబంధనల మేరకు సాదాసీదాగా ఉత్సవాలు జరుపనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొననున్నారు. కొవిడ్‌ ‌నిబంధనల మేరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.

ఆదిలాబాద్‌లో జరిగే ప్రభుత్వ విప్‌ ‌గంప గోవర్ధన్‌, ‌భదాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ విప్‌ ‌రేగా కాంతారావులో, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌జయశంకర్‌ ‌భూపాలపల్లిలో ప్రభుత్వ విప్‌ ‌భానుప్రసాద్‌ ‌రావు, జనగామలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ‌బోడకుంటి వెంకటేశ్వర్లు,జోగులాంబ గద్వాల లోప్రభుత్వ విప్‌ ‌గువ్వల బాలరాజు, కామారెడ్డిలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌, ‌కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, మబూబ్‌ ‌నగర్‌ ‌లో మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మహబూబా బాద్‌ ‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, ‌మంచిర్యాలలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ ‌శర్మ, మెదక్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరిలో మంత్రి మల్లారెడ్డి, ములుగులో ప్రభుత్వ విప్‌ ‌ప్రభాకర్‌ ‌రావు, నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ విప్‌ ‌దామోదర్‌ ‌రెడ్డి, నల్లగొండలో మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి,నారాయణపేట మండలి డిప్యూటీ చైర్మన్‌ ‌నేతి విద్యాసాగర్‌ ‌రావు, నిర్మల్‌ ‌మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి
నిజామాబాద్‌ ‌మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, పెద్దపల్లిలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రాజన్న సిరిసిల్ల మంత్రి కేటీఆర్‌, ‌రంగారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డి మంత్రి మహముద్‌ అలీ, సిద్దిపేట మంత్రి హరీష్‌ ‌రావు, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి, వికారాబాద్‌లో డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు, వనపర్తి మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, వరంగల్‌ ‌రూరల్‌ ‌ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌ప్రభుత్వ చీఫ్‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ‌యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్‌ ‌గొంగిడి సునీత జెండా ఆవిష్కరిస్తారు.

KCR flag in SirisillaKCR in HyderabadMinister Harish Rao unveiled in Siddipet
Comments (0)
Add Comment