- రైతు భరోసా కేంద్ర భవనాలను పూర్తి చేయాలి
- ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సక్ష
- కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ
- అధికారులకు సిఎం జగన్ ఆదేశాలు
అమరావతి, అక్టోబర్ 21 : ఉపాధిహా పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సిఎం జగన్ ఆదేశించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై తగిన దృష్టిపెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారు వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలన్నారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు దృష్టిపెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై కూడా ఈ సక్షలో సీఎం జగన్ చర్చించారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశర చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సక్ష నిర్వహించారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్స్పైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో డిజిటిల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం. అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ను సరఫరాచేస్తాం. దీనివల్ల వర్క్ ప్రమ్ హోం కాన్సెప్ట్ సాకారం అవుతుంది. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి.
తొలివిడతలో భాగంగా 4314 లైబ్రరీలను నిర్మిస్తున్నాం. ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోండి. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పంట కొనుగోలు జరగాలంటే ఇ- క్రాపింగ్చేయాలి. ఇ- క్రాపింగ్ చేయించడమన్నది ఆర్బీకేల ప్రాథమిక విధి అన్నారు. ఇ-క్రాపింగ్పైన కలెక్టర్లు, జాయంట్ కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. యాప్ పైనకూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశజనక పరిస్థితులు ఉన్నా.. సీఎం యాప్ద్వారా… పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలన్నారు. ఇ- క్రాపింగ్చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా?చూడాలన్నారు. గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ క్రాపింగ్ జరగాల్సిందేనని అన్నారు. ఇ క్రాపింగ్ఉంటనే పంటలబీమా, సున్నావడ్డీ, పంటకొనుగోళ్లు, ఇన్పుట్సబ్పిడీ … ఇవన్నీకూడా సవ్యంగా జరుగుతాయన్నారు.
అగ్రికల్చర్ అడ్వైయిజరీ టింగ్స్ కచ్చితంగా జరిగేలా చూడాలని, నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో అడ్వైయిజరీ సమావేశాలు జరగాలి, నాలుగో శుక్రవారం వ్యవసాయశాఖకార్యదర్శి సమక్షంలో రాష్ట్రస్థాయిలో సమావేశం జరగాలని, ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు కొనసాగాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన వాటిని ఆర్బీకేల ద్వారా పంపిణీచేయాలన్నారు. నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పారు. ఎంప్యానెల్ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలన్నారు.సీడ్కార్పొరేషన్.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలన్నారు.
ఆర్బీకేల ద్వారా ఇస్తున్నవాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దని,కలెక్టర్లు నుంచి అందరూ కూడా సమిష్టిగా బాధ్యత వహించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాం. అప్పటివరకూ స్టోరేజీకోసం… అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోండని అన్నారు. ఇన్పుట్సబ్సిడీ ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదన్నారు.
అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధంకావాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు,భూ రక్ష పథకం విప్లవాత్మకమైనదని అంటూ 100 సంవత్సరాల క్రితం సర్వే అయ్యింది, 100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్డేట్ చేస్తున్నాం, గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్పడుతుందన్నారు. గ్రామ సచివాలయాల్లో సబ్రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది. పైలట్ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది. మరో 650 గ్రామాల్లో డిసెంబర్కల్లా పూర్తవుతుంది. 2023 జూన్కల్లా మొత్తం సర్వే పక్రియ ముగుస్తుంది. కలెక్టర్లు, జాయింట్కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలన్నారు. సర్వే అవగానే రికార్డులు అప్డేట్ అవుతాయి, కొత్త పాసుపుస్తకాలు యజమానులకు ఇస్తాం. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం సక్ష చేస్తూ ఈ పథకం వల్ల లక్షలమందికి ఉపయోగం ఉంటుందని,47.4 లక్షల మంది లబ్ది పొందుతారని అన్నారు. డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి. గతలో జరిగిన అవుట్రీచ్ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు నా దృష్టికి వచ్చింది. కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి… కుటుంబాలను కచ్చితంగా కలవాలి. నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలని సిఎం సూచించారు. 2020 ఖరీఫ్కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాల కార్యక్రమం అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవా లన్నారు. నవంబర్లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ పక్రియ పూర్తి చేయాలి. 10 రోజుల ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు అన్నారు. కారయక్రమంలో అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.