రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 494 మందికి పాజిటివ్‌..‌ ముగ్గురు మృతి
AP Corona Bulletin Today రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 494 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 621 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ముగ్గురు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 80 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 51 కేసులు, వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,50,353 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,831కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,38,410 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 8,112గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ap corona bulletin today
Comments (0)
Add Comment