ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన
,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర:
 జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు
 హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని.. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకరావాలని ఆకాంక్షించారు.. ప్రజలందరు సుఖసంతోషాలతో సుబిక్షంగా ఉండాలని… పసిడి పంటలతో పరిడ విల్లాలన్నారు.. ఈ భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి అని, కనుమ పండగ కనువిందుగా జరుపుకోవాలని  ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అని భగవంతున్నీ కోరుకున్నారు.. ప్రజలందరికి శుభం చేకూరాలని  , ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
festivalFormer Ministergreetingsharish raomlaSankrantiSiddipettelangana
Comments (0)
Add Comment