సత్తుపల్లి జామ మసీదు రంజాన్‌ ‌ప్రార్దనల్లో పాల్గొన్న సండ్ర

ఖమ్మం సిటి, మే 25, (ప్రజాతంత్ర విలేకరి) : ముస్లిం సోదరులకు సత్తుపల్లి శాసనసబ్యులు సండ్ర వెంకటవీరయ్య రంజాన్‌ ‌పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సత్తుపల్లిలో జామమసీద్‌లో రంజాన్‌ ‌పండుగ సందర్బంగా ముస్లిం పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్దనలు చేసారు ముస్లిం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐకమత్యం, క్రమశిక్షణ, మానవాళికి ఇచ్చే గొప్ప సందేశం అని చెప్పరు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. విపత్కర పరిస్తితుల్లో జాగ్రత్తలు పాటిస్తూ కఠిన ఉపవాసదీక్షలు ఆచరించారన్నారు. నెలరోజుల కఠిన ఉపవాసాలను విజయవంతం చేసినందుకు ముస్లింలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పాటునందించటం లాంటివి ఈ పండుగ మానవాళికి ఇచ్చే గొప్ప సందేశమన్నారు. అందరూ సంతోషంగా ఉండ•మే పండుగలోని పరమార్దమని చెప్పారు. అనంతరం ఆయన రంజాన్‌ ‌పండుగ ప్రత్యేక పానీయమైన సేమియాను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్తానిక ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment