వేసవి సెలవుల్లో సామన్య భక్తులకు ప్రాధాన్యం

  • సిఫారసు లేఖలపై నియంత్రణ
  • నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు
  • రోజుకు 10 వేల టోకెన్లు జారీ
  • వి•డియాకు వివరించిన టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి

తిరుమల, మార్చి 27 : వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన సవి•క్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 1 ‌నుంచి నడిచి వొచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు, అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో బ్రేక్‌ ‌సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు తెలిపారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వొచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టిటిడి ఛైర్మన్‌ శ్రీ ‌వైవి.సుబ్బారెడ్డి వెల్లడిరచారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ ‌వి•డియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు.

ఏప్రిల్‌ 15 ‌నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీ‌వాణి, టూరిజం కోటా, వర్చువల్‌ ‌సేవలు, రూ.300/’ దర్శన టికెట్లు తగ్గించనున్నట్లు వెల్లడించారు.  ఈ మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరడమైనది. తద్వారా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు.  ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు  కాలకుండా కూల్‌ ‌పెయింట్‌ ‌వేస్తామన్నారు.  తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగింది. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగింది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్, ‌పిఏసి’2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తాం. ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు చేసామని అన్నారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకుంటామని, టిటిడి విజిలెన్స్, ‌పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ ‌సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ ‌సమస్య లేకుండా చూస్తామని, శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తామని వైవి వివరించారు.

Comments (0)
Add Comment