“సీను బుగ్గయిన త్యాగం యెవలికోసం!? పెద్దోళ్ళ గెలుపు కోసం పేదోళ్ళు గిట్ల జీవిడుసుడు యెవలి ఫాయిదా కోసమనే సోయుండాలె! “తెలంగాణా కోసం ఇదే ఆకరి ప్రాణత్యాగం” అనుడేంది! మళ్ళ తెలంగాణా తెచ్చేందుకు ఎన్ని వేలమంది సదూకునే పోరలు త్యాగంజేయాల్నో లెక్కజెప్పుండ్రి! తెలంగాణ కొట్లాటంటె పేదోళ్ళు జీవిడివాలె. పెద్దోళ్ళు గద్దెక్కాలె! పెయి మీద నూనె బోసుకునే గరీబోళ్ళ సావులు నాల్గుమూలల కాడ స్తూపమై నిలువాలె! సాలిక! గీ ఆట ఆపేటందుకైనా “రెడ్డచ్చెమొదలాడ”నేటి రాజకీయాలు మారాలె! దుబ్బాకాసొంటి ఎలచ్చన్లు యెన్నచ్చినా పెద్దోళ్ళే గెలుత్తరు గని పేదోళ్ళు గెలుసుడేది!? ! యేండ్ల సంది ఎలచ్చన్లత్తానయి గని ,యేనాడు సుత “జిపాటిస్”రాని బతుకు పేదోళ్ళదే!”
దుబ్బాకంటె యాదచ్చే తోపు లీడరు ‘చెరుకు’ లేకుంట అయ్యేటి ఎలచ్చన్లియి.’చెరుకు కుటుంబం’ యెంబటుండే ఓట్ల శాతమేం తక్కువేం కాదు.’తోగుంట’ బోయి ‘దుబ్బాక’ అయినంక సుత చెరుకోళ్ళ యెంబటుండే ఊర్లు తక్కువేం గాదు.’సోలిపేట’ వున్నకాలం మాగనేనడిషింది.’సోలిపేట’ పోయినంక దుబ్బాకల గులాబి జెండెగురుడు తిప్పలనుకోవాలె!గీ లగులన్ని యెరిక గాబట్టే సుజాతక్కను ముందుకు తెచ్చిండ్లు. అదిసుత సాలదని యెరికె! అటెంక జనం ధిమాక్ లను తొవ్వతప్పిచ్చి షెవుల కొత్త పూలు పెట్టే కత
లు పడ్డరు. గులాబీ పార్టీ కి పోటి “చెరుకు” వాళ్ళు కాదనే ఇగురం జనం ల తోలేటందుకు తిప్పలు బడ్డరు.పూవు గుర్తు అభ్యర్థిని హీరోను జేషి “బడ్జెట్ సిన్మాలు” మాగనే దీషిండ్లు. అభ్యర్థి వాళ్ళ మావళ్ళోంటి లోకేషన్ల తీషిన సిన్మా సూపర్, డూపర్ ఇట్టయిందన్నరు.తమ్మున్ని, కారుడైబర్ను సుత ఇడిశి పెట్టలె! గులాబీ రంగు పేపరోళ్ళు గీ సిన్మాల మీద షిల్వలు పల్వలు కతలు రాశి సేవ మాగనే జేషిండ్లు.’చెరుకుసత్తెం’ ఊసు లేకుంట సీరియల్లు మస్తు తీసుడెనుక గులాబీమూవీస్ “త్రివిక్రమ్” మామను మించిన అల్లుడని గులాబీల పెద్దోళ్ళు తారీఫ్ జేయబట్టె!
సచ్చినోని పెండ్లికివచ్చిందే కట్నమని రియాల్టి షోల తీర్గ పూవు గుర్తోళ్ళు సుత మస్తు నటించి ఇరుగ దీశిండ్లు.”నందులు” కాదు గదా “ఆస్కార్లు” సుత సాలయి.పో!అనటట్టుండె!అప్పోజిషనో ళ్ళు తీశిన సిన్మాల మనం నటిస్తె లాబమెవలికో తెల్వకుంటబాయె!సూపర్ ఇట్టయినయి. బాక్సాఫీసు పలిగింది గని బకరాలైందెవలో నన్న సోయి లేకుంట బాయెనని జనం జెప్పుకోబట్టె! గులాబీపూవు,తామరపూవు మద్దెనే పోటీ గని గీళ్ళు గాక బద్దిల ఎసొంటి చెరుకు,చేతుల్లేవనే ఇగురం జనం షెవంలేశేటందుకు మాగనె తిప్పలుబడ్డరు. గిసొంటి యెన్ని బాగోతులాడినా ఎవలి “జిపాటిస్”లు గాళ్ళకే వుంటయని జనం అనుకోబట్టిండ్లు. అధికారం,గాచారంతోని కల్శి “గులాబి రాశి”ల్నే వున్నయి గాబట్టి అక్క దిక్కే పాసంగం వుంటదని పెరిగిన ఓట్ల శాతం అంజనమేషి జూపెడుతాంది.మంగలారం గ్రహాలు జరింత అటిటు కదిలి వక్రదుష్టితోని గనుక జూత్తె “చెరుకు చెట్టయి”నిల్సుండే అందాదైతె కానత్తాంది. గీళ్ళ మద్దెనె “సెకోండ్”ఎవలో తేలాలె!
“సెకోండ్” ఆశలు అటెంక గని “జిపాటిస్” అయినా పైలంగున్నట్టా! అనేటి రంధి ఎవలికున్నదో అందరికి యెరుకైతాంది. “ప్లే ఆఫ్” పోకుంట వుండెటోళ్ళు ఎవలనేది ఓట్లేషేటానికి ముందే జనానికైతె యెరుకైంది.”ఈ వూర్లె దొరైతె పక్కూర్లె పప్పులుడుకుతాయా”!? పైన సర్కార్ మనదైతె మటుకు ఫాయిదేమున్నది.లోకల్ పోలీస్ మంది మార్బలమంత గులాల్ బూసుకోని తిరుగంగ అక్క గెలుపుకు అడ్డం యేం గడ్తలేదు.గోల్కొండ మీద జెండెగురేషేటి ముహుర్తానికి ఇంక మూడేండ్లున్నది.గింత ముందు నుంచే గీ తండ్లాటెందుకనికని బుద్ది జీవులనబట్టె! అబిమానం అద్దులు దాటింది. మళ్ళ మీద నూనె బోసుకొని బుగ్గయ్యేటి తప్పుడు తోవ బట్టింది. నాయకుల కోసం జెండ మోషిన గరీబోడు బుగ్గయితె రాజకీయ చైతన్యమని గులాబీ పార్టోళ్ళు యెలుగు బెట్టిన దిక్కుమల్ల బాగోతం.దీనికి రంగు సీను జీవిడుసుడు కంటతడి బెట్టిచ్చింది.అయితె సీను బుగ్గయిన త్యాగం యెవలికోసం!? పెద్దోళ్ళ గెలుపు కోసం పేదోళ్ళు గిట్ల జీవిడుసుడు యెవలి ఫాయిదా కోసమనే సోయుండాలె! “తెలంగాణా కోసం ఇదే ఆకరి ప్రాణత్యాగం” అనుడేంది! మళ్ళ తెలంగాణా తెచ్చేందుకు ఎన్ని వేలమంది సదూకునే పోరలు త్యాగంజేయాల్నో లెక్కజెప్పుండ్రి! తెలంగాణ కొట్లాటంటె పేదోళ్ళు జీవిడివాలె. పెద్దోళ్ళు గద్దెక్కాలె! పెయి మీద నూనె బోసుకునే గరీబోళ్ళ సావులు నాల్గుమూలల కాడ స్తూపమై నిలువాలె! సాలిక! గీ ఆట ఆపేటందుకైనా “రెడ్డచ్చెమొదలాడ”నేటి రాజకీయాలు మారాలె! దుబ్బాకాసొంటి ఎలచ్చన్లు యెన్నచ్చినా పెద్దోళ్ళే గెలుత్తరు గని పేదోళ్ళు గెలుసుడేది!? ! యేండ్ల సంది ఎలచ్చన్లత్తానయి గని ,యేనాడు సుత “జిపాటిస్”రాని బతుకు పేదోళ్ళదే!
సూడ్రా బయ్! ఇక్రమార్క్!
ఇంటివి కదా! ఎవలు గెలిషిండ్లు,యెవలోడిండ్లు,ఫస్టె వలు!”సెకోండు” యెవలనేది పక్కన బెట్టి,దుబ్బాక బయెలచ్చన్లతోని యెవలికెట్ల ఫాయిదయిందటవు!?నా ప్రశ్నకు జవాబు చెప్పకుంటె నీ పేరుజెప్పి అసెంబ్లీ గేట్ తాన పెయి మీద నూనె బోసుకుంట”!అని బెదిరిచ్చే భేతాళుని భుజానెత్తు కొని”ఇను! భేతాళ్!దుబ్బాక బైయెలచ్చన్ల గెలుత్తమా! “సెకోండ్”అత్తదా,”జపాటిస్” అత్తదా అనేది గాకుంట ప్రచారం పేరుమీద రచ్చరచ్చ జేయాలనుకున్నరు పూవు గుర్తోళ్ళు. కారుకు యెదురచ్చేది,యెదురిచ్చేది మేమే! అనే ఇగురం జనం లకు పంపాలనుకున్నరు,పెయిమీద నూనె బోసుకుని జీవిడిషే కొత్త తెలంగాణ ఉద్దెమం దాంక గుంజాయిషీ మాగనే అయింది. గులాబీ పార్టోళ్ళ గోస ఇంకో తీరున్నది. ముత్తెంరెడ్డిని జనం మర్వలేదని,కారుకు అడ్డంబడేది చెయ్యేనని యెరుకైంది.ఛలో! “పూవు గుర్తోళ్ళకు,కారుకుమద్దె నే అసలు పోటీ” అని జనం మద్దెనిడిషిండ్లు. దీనికోసం తీరొక్క తిప్పలుబడ్డరు. గిట్ల యెవలి ఫాయిదాలు వాళ్ళకున్నయి. జీవిడిషిన “రంగు సీను”కు,తెలంగాణ సమాజానికి మాత్రం ఫాయిదేం కానత్తలేదు”!అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వబట్టిండు.