ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్కు కొరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు కనిపించని ఓ రోగికి వైద్యం చేసిన సమయంలో డాక్టర్ నాగేందర్కు కొరోనా సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం డాక్టర్ ఐసోలేషన్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఉస్మానియా హాస్పిటల్లో కొరోనా రోగులకు వైద్యం కొనసాగుతున్న విషయం విదితమే. అయితే డాక్టర్ నాగేందర్.. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)కు సంబంధించిన పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో సీనియర్ సభ్యులుగా నాగేందర్ కొనసాగుతున్నారు.