రాష్ట్రంలో కొనసాగుతున్న కొరోనా విజృంభణ

తాజాగా 1913 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కొరోనా విజృంభణ కొనసాగుతున్నది. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1913 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం 1913 కొరోనా కేసులు నమోదుకాగా..వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 1214 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 161 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,87,456 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,036కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,75,573 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య మళ్లీ పెరిగి 7,847గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment