రాష్ట్రంలో కొత్తగా 2,579 మందికి పాజిటివ్‌

కొరోనాతో తాజాగా 9 మంది మృతి
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,579 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోనే 295 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,08,670 పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ కాగా, వైరస్‌ ‌ప్రభావంతో తాజాగా 9 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 770కి చేరింది. మరో 1,752 మంది వైరస్‌ ‌బారినుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 84,163 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 23,737 మంది దవాఖానల్లో చికిత్స పొందు తున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌కేంద్రాల్లో 17,226 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 52,933 మందికి కోవిడ్‌ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 10, 21,054 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు
దేశంలో కొరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 31 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 60,975 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,324కి చేరింది. ఇందులో 7,04,348 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 66,550 మంది దవాఖనాల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు కొరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 24,04,585గా ఉంది. సోమవారం దేశవ్యాప్తంగా 848 మంది కొరోనాతో మరణించారు. దాంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 58,390కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Comments (0)
Add Comment