కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించే కార్యక్రమం లో భాగంగా. మహబూబూబాద్‌ ‌జిల్లాలో జూలై 4,5 తేదీల్లో మన ఊరు-మనబడి పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో సర్వే నిర్వహించింది.
 మొదటి రోజు… జూలై నాలుగు
మహబూబూబాద్‌ ‌మండలంలోని ప్రాథమిక పాఠశాల జమాండ్లపల్లిలో 156 మంది విద్యార్థులకు గాను 2 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కూల్చివేయాల్సిన గదులు 4 ఉన్నవి. ఇవి తీవ్రమైన ప్రమాదకరంగా ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు ఇందులోనే కూర్చోవాల్సి వస్తుంది.ఎం.ఓ.ఎం.బి.పథకంలో లో 75 లక్షలు మంజూరు అయినా ఇప్పటివరకు ఈ ఒక్క పని ప్రారంభం కాలేదు.పక్కనున్న ఉన్నత పాఠశాలను సందర్శించగా ఎం.ఓ.ఎం.బి పథకం లో భాగంగా 23 లక్షల ఎస్టిమేషన్‌ ‌చేసారు పనులు ప్రారంభం కాలేదు.
కంబాలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా ర్థుల సంఖ్య 154. అందుబాటులో ఉన్న గది ఒక్కటి.. కూల్చివేయాల్సిన గదులు 4.ఎం.ఓ.ఎం.బి.పథకంలో ఎస్టిమేషన్‌ 40 ‌లక్షలు.. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. విద్యార్థులకు అనివార్య పరిస్థితులలో.. ప్రమాదకరమైన గదులలోనే విద్యాబోధన చేస్తున్నారు.ఉన్నత పాఠశాల కంబాల పల్లికి ఎం.ఓ.ఎం.బి పథకంలో 43 లక్షలు ఎస్టిమేషనుండగా ఒక్క పనికూడా ప్రారంభంకాలేదు.’’మనఊరు-మనబడి’’ కి ఎంపికైనప్పటికీ పనుల ప్రారంభం ఊసేలేదు. ఎం. ఓ.యూ కూడా పూర్తి కాలేదు. ప్రాథమిక పాఠశాలలో వందకు పైగా విద్యార్థులు, సరిపోనూ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ తరగతి భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. ఇదివరకే జిల్లా కలెక్టర్‌ ‌సందర్శించి, వాటిలో తరగతులను నిర్వహించవద్దని చెప్పారు. కానీ ప్రత్యామ్నాయం లేదని ఉపాధ్యాయులు తెలిపారు.

గూడూరు మండలంలోని మచ్చెర్ల, పొనుగోడు, తాళ్ళపాటి తండా, తీగలవేణి గ్రామాల్లోని పాఠశాలలకు రెండు పాఠశాలలను ఎం.ఓ.ఎం.బి పథకం లో మోడల్‌ ‌పాఠశాలలుగా ఎంపిక చేశారు. అవి ప్రాథమిక పాఠశాల మచ్చెర్ల, జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌. ‌తీగలవేణి. ప్రాథమిక పాఠశాల మచ్చర్ల కు ఎం.ఓ.ఎం.బి.కింద 12 లక్షలు కేటాయించారు. కిచెన్‌ ‌షెడ్‌ ‌కొరకు పునాదులు మాత్రమే తవ్వారుమచ్చర్ల  లో ఎం. ఓ. యూ.కూడా కాలేదు.ఎం.ఓ.ఎం.బి లో 25 లక్షలు కేటాయించారు.ఆటస్థలం లేకపోవడం, ప్రాథమిక పాఠశాలకు పాతబడిన  భవనాలు ఇబ్బంది గా ఉన్నాయి.
జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌. ‌పోనుగోడు పాఠశాల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా వేరు చేయలేదు. 577 మంది విద్యార్థులు నమోదైన ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు ఎస్‌.‌జి.టి. ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తుండడం ఆర్‌.‌టి.ఓ.చట్టానికి విరుద్దం.ఆ గ్రామానికి చెందిన దాత కోరే వెంకన్న తరగతుల నిర్వహణ కొరకు రేకుల షెడ్డులు, మూత్రశాలలు నిర్మించడమే కాకుండా ఆరుగురు ప్రైవేట్‌ ఉపాధ్యాయులను నియమించి ప్రతీ నెలా లక్షకు పైగా వేతనాలుగా ఇస్తుండడం అభినందనీయం.ఈ పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ,ప్రతిస్పందనలు ఆకట్టుకున్నాయి. బోధన,బోధనేతర సిబ్బందితో పాటు మొత్తం 20 మంది అవసరమైన చోట ఇద్దరు మాత్రమే పనిచేస్తుండడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఎం.ఓ.ఎం.బి లో 20 లక్షలు కేటాయించారు.ఇంకా పనులు ప్రారంభం కాలేదుఇక్కడ అదనపుతరగతి గదులు, ఉపాధ్యాయుల  అవసముంది. ప్రాథమిక పాఠశాల తాళ్ళపాటి తండాలో40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు.ఆర్‌.‌టి.ఓ.ఏక్ట్. ‌ప్రకారం మరో ఉపాధ్యాయుడి అవసరం ఉంది.ఉన్నత పాఠశాల తీగలవేణి  ఎం.ఓ.ఎం.బి మోడల్‌ ‌స్కూల్‌ ‌మనఊరు-మనబడి పనుల్లో గ్రౌండ్‌ ‌వర్క్ ‌ప్రారంభమైంది.ఇక్కడి పాఠశాల ఆటస్థలాన్ని గ్రామీణ క్రీడాప్రాంగణం గా ప్రకటించారు.
 రెండవ రోజు… జూలై ఐదు
మహబూబూబాద్‌ ‌మండలం కంబాలబండ తండా, ప్రాథమిక పాఠశాల కుమ్మరి కుంట తండా,జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌ , ‌ప్రాథమిక పాఠశాల శనిగపురం,జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌ ‌ప్రాథమిక పాఠశాల ఆమనగల్‌, ‌నెల్లికుదురు మండలంలోని  నర్సింహుల గూడెం, ప్రాథమిక పాఠశాలకు ధర్మ తండా, ప్రాథమిక పాఠశాల సంధ్య తండా, ప్రాథమిక పాఠశాల బంజర, జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌ ఆలేరు,జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌., ‌ప్రాథమిక పాఠశాల చిన్న ముప్పారం పాఠశాలలను సందర్శించడమైంది.
కుమ్మరికుంట తండా గత విద్యా సంవత్సరం మూసివేయగా తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫడరేషన్‌ (‌టి.పి.టి.ఎఫ్‌.) ‌ప్రాతినిధ్యం మేరకు ఈ సంవత్సరం  తెరిచారుప్రాథమిక పాఠశాల కుమ్మరికుంట్ల గత 3 సం. క్రితమే విద్యార్థులు రావడం లేదనే కారణంతో ముసివేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలను వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రంగా మార్చడం శోచనీయం. ఈ విద్యా సంవత్సరం బడిబాట కార్యక్రమం లో భాగంగా నమోదైన కొద్దిమంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు చెట్టు కిందనే పాఠశాలను నిర్వహిస్తున్నారు.ఇక్కడ నిర్వహిస్తున్న అంగన్వాడీలో 19 మంది విద్యార్థులుండగా స్వంత భవనం లేని కారణంగా కిరాయి ఇంటిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ బడి ఈడు గల 10 మంది పిల్లలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు, మరికొంత మంది ప్రైవేట్‌ ‌పాఠశాలకు వెళుతున్నారు.అమనగల్‌ ‌లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో తరగతులకు,విద్యార్థులకు తరగతి గదుల కొరత,ఆటస్థలం కొరతగా వుంది.ఎం.ఓ.ఎం.బి పనుల కు నిధులు మంజూరుకాకున్నా స్థానిక సర్పంచ్‌ ‌పనులు ప్రారంభించారు.
ప్రాథమిక పాఠశాల ధర్మ తండాను ఎం.ఓ.ఎం.బి పనులు ఇంకా మొదలు కాలేదు.ప్రాథమిక పాఠశాల సంధ్య తండాను నాలుగేళ్ళ క్రితం మూసివేశారు. ఇక్కడ ఆవాస ప్రాంతంలో వున్న తొంబయి ఇండ్లలో బడి ఈడు పిల్లలు ఉన్నారు.వీరంతాసమీప ప్రభుత్వ పాఠశాలకు కొందరు,మిగతా వారు ప్రైవేట్‌ ‌పాఠశాలకు వెళుతున్నారు. పాఠశాలలో వున్న రెండు గదులలో ఒకటి  గ్రామపంచాయతీ కార్యాలయానికి,• •ండవ గది అంగన్వాడీ పాఠశాలను నిర్వహణకు ఉపయోగి స్తున్నారు. ఆటస్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసారు.ఈ పాఠశాలనీ తెరిస్తే ఇక్కడి పిల్లలు ఇక్కడే చదివే అవకాశం ఉంది.

జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌.ఆలేరు పాఠశాలలో ఎం.ఓ.ఎం.బి లో మోడల్‌ ‌పాఠశాలగా ఎంపిక చేసారు.. గ్రౌండ్‌ ‌వర్కస్ ‌ప్రారంభం అయినవి.జడ్‌.‌పి.హెచ్‌.ఎస్‌.‌చిన్న ముప్పారం లో ఇద్దరు ఉపాధ్యాయుల అవసరం ఉంది. మొత్తం సర్వేలో పరిశీలించిన మేరకు సమస్యలన్నీ సాధారణంగా ఉన్నాయి. విద్యార్థులు,ఉపాధ్యాయులు ఉన్నచోట తరగతిగదులు లేవు. గదులున్న చోట పిల్లలులేరు. పిల్లలు ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయులు లేరు. కనీస సదుపాయాలైన మూత్రశాలలు లేకపోవడం, ఉన్నచోట రన్నింగ్‌ ‌వాటర్‌ ‌లేక దుర్వాసన రావడం, నిరుపయోగంగా ఉండడం,ఆటస్థలం లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది కొరత వంటివి తీవ్రమైన సమస్యలు. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వండిపెట్టే డ్వాక్రా సంఘాల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. గుడ్లు, నూనె, కూరగాయల ధరల కంటే ప్రభుత్వం చెల్లించే యూనిట్‌ ‌కాస్ట్ ‌చాలా తక్కువగా ఉండడం, దానికి తోడు బిల్లుల చెల్లింపులో నెలల తరబడి ఆలస్యం కావడం వల్ల అందరూ పాఠశాలల్లో వంట చేయడం మానే యాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందిం చకుంటే చాలా బడులలో  కొద్ది రోజుల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయే అవకాశం ఉంది.
పరిశీలనలో పాఠశాలలోనీ గదులను గ్రామపంచాయతీ కార్యాలయాలుగా, ఆట స్థలాలను పల్లె ప్రకృతి వనాలుగా, గ్రామీణ క్రీడా ప్రాంగణాలుగా,కుక్కల సంతానం నిరోధక కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలపై సర్వేలో పరిశీలించిన విషయాలను రెండవ రోజు జూలై ఐదున సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ‌కు రాతపూర్వకంగా ప్రాతినిధ్యం చేసి,అంశాల వారీగా నేరుగా వారితో చర్చించగా, తన పరిధిలో ఉన్న అన్ని అంశాల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ రెండు.రోజుల కార్యక్రమంలో విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ‌సెక్రెటరీ ప్రొఫెసర్‌ ‌కె లక్ష్మినారాయణ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చుంచు శ్రీశైలం,పులి చింత విష్ణువర్ధన్‌ ‌రెడ్డి, తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌ (‌టి.పి.టి.ఎఫ్‌ )‌మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు,జిల్లా ఉపాధ్యక్షులు,ఎం.డి. సైదుల్‌ ‌పాషా, బి.రమేష్‌, ‌జిల్లా కార్యదర్శి మహబూబ్‌ అలీ, వివిధమండలాల బాధ్యులు సోమ రవి, సంగ శ్రీనివాస్‌, ‌జి. కార్తిక్‌, ‌గునిగంటి శ్రీను, డెమోక్రాటిక్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌ (‌డి.టి.ఎఫ్‌)‌బాధ్యులు భీముడు,కృష్ణమూర్తి పి.డి.ఎస్‌.‌యు నాయకులు మధు, మహేష్‌ ‌మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 – తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ క్షేత్ర పర్యటన రిపోర్ట్
kadethesina ma uru mana badiprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment