- విచారణ అక్టోబర్ 20వ తేదీకి వాయిదా
- డ్రగ్స్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డికి ఆదేశం
డ్రగ్స్ వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని మంత్రి కెటిఆర్ సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి వేశారు. దానిని సిటీ సివిల్ కోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిటీ సివిల్ కోర్ట్ మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి ఆ పిటిషన్పై విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు, ఈడీ కేసుల్లో కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. అక్టోబర్ 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది.