- రాష్ట్ర ప్రభుత్వాలతో కొవిద్-19 నియంత్రణ పై కేంద్రం సంప్రదింపులు
కోవిద్-19ని ఎదుర్కోవటానికి సంబంధించి డబ్ల్యుహెచ్ఒ పిరియాడికల్ సలహాలను కేంద్ర ప్రభుత్వం మర్యాదపూర్వకంగా పక్కనపెట్టింది. డబ్ల్యుహెచ్ఒ సలహాలకి బదులుగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అనేక రాష్ట్ర ప్రభుత్వాల అనుభవంకు పెద్దపీట వేయటానికి కేంద్రం మొగ్గు చూపింది. కేరళ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వస్తున్న సలహాలు సూచనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.రోగనిరోధకత, టిబి, ఇతర నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులకు సంబంధించి ఎప్పటి మాదిరిగా డబ్ల్యుహెచ్ఒ సలహాలను పాటిస్తూన్నప్పటికీ, నవల్ కరోనావైరస్ వ్యాప్తిపై మాత్రం కేంద్రం, రాష్ట్రాలతో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల, ఏప్రిల్ 3 న, ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు మాస్క వాడటంపై ప్రభుత్వం జారీచేసిన ఆదేశం డబ్ల్యుహెచ్ఒ సలహాతో విభేదిస్తుంది.
మాస్కులు కొవిద్ 19రోగులు, రోగ లక్షణాలు ఉన్నవారు, ఆరోగ్య కార్యకర్తలు,కరోనా వైరస్ సంరక్షకులుగా ఉన్నవారికి మాత్రమే వాడాలని డబ్ల్యుహెచ్ఒ తెలిపింది.కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు… జనవరి 30 న, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ చైనాకు ప్రయాణ పరిమితులను డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేయలేదని – వాస్తవానికి, అలాంటి ఆలోచనని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అదే రోజున, డబ్ల్యుహెచ్ఒ అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల అత్యవసర కమిటీ కరోనా బారిన పడినివారి నియంత్రణ, నిఘా, గుర్తించడం, వేరుచేయడం కాంటాక్ట్ ట్రేసింగ్ ఆవశ్యకతపై ప్రపంచానికి హెచ్చరిక జారీ చేసింది. ఆ సమయానికి, జనవరి25 నాటి చైనాకు అనవసరమైన ప్రయాణాన్ని నివారించడానికి సంబంధించి భారతదేశం మొదటి హెచ్చరిక ఆప్పటికే అమలులో ఉంది. అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేసిన మూడు రోజుల తరువాత, చైనా ప్రయాణానికి దూరంగా ఉండమని భారతదేశం పౌరులకు సూచించింది. మార్చి 16న, ఘెబ్రేయేసస్ డబ్ల్యుహెచ్ఒ ఇచ్చిన సందేశంలో “ టెస్టింగ్ ..టెస్టింగ్.. టెస్టింగ్” అని అన్నారు.
మార్చి 22న, ఐసిఎంఆర్ హెడ్ డాక్టర్ బలరామ్ భార్గవ ఇలా అన్నారు: “విచక్షణారహిత పరీక్ష ఉండదు…”క్వారంటైన్..క్వారంటైన్..క్వారంటైన్” (quarantine) అన్నారు. ఆ తరువాత కొన్ని గంటల కు ..మార్చి 24 అర్ధరాత్రి నుండి దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళింది. విమానాశ్రయ స్క్రీనింగ్ కంటే వైరస్ కలిగి ఉండటానికి దిగ్బంధం చేయటం ప్రభావవంతమైన మార్గం అని ఐసిఎంఆర్ చెప్పిన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్ఓ అధికారులు భారత ప్రభుత్వంతో ఉన్న విభేదాలపై స్పందించడానికి నిరాకరించారు.భారతదేశానికి సంబంధించిన డబ్ల్యుహెచ్ఒ ప్రతినిధి హెన్క్ బెకెడామ్ ఇలా అన్నారు ..”కొవిద్-19 కి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం కీలకమైన దశలో ఉంది. డబ్ల్యుహెచ్ఒ ,ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కొవిద్-19 పై చేసే పోరును పరిశీలిస్తుంది. ప్రయోగశాలు పరిశోధన ప్రోటోకాల్స్, రిస్క్ కమ్యూనికేషన్స్, ఆసుపత్రి సంసిద్ధత, సంక్రమణ నివారణ నియంత్రణ, క్లస్టర్ నియంత్రణ ప్రణాళికపై శిక్షణ.. ఈ సవాళ్లను అధిగమించడానికి దృఢ నిశ్చయంతో డబ్ల్యుహెచ్ఒ భారత్ తో పని చేస్తుంది..అన్నారు.