వైద్యారోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఖాళీల భర్తీ

  • ఆస్పత్రుల ఆధునీకరణకు తక్షణ చర్యలు
  • సుమారు 14,200 పోస్టుల భర్తీకి నిర్ణయం
  • అక్టోబర్‌ 1‌నుంచి నవంబర్‌ 15‌కల్లా రిక్రూట్‌మెంట్‌ ‌పూర్తి
  • ఉన్నతస్థాయి సక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి,సెప్టెంబర్‌ 24 : ‌వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలను తక్షణం భర్తీ చేయడంతో పాటు వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని సిఎం జగన్‌ ‌నిర్ణయించారు. ఆస్పత్రులను కూడా అధునాతనంగా తీర్చిదిద్దాలన్నారు.  ఇందుకు అవసరమైనా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.భారీ రిక్రూట్‌మెంట్‌కు ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ ‌చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అక్టోబరు 1నుంచి పక్రియ మొదలు పెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిం చాలని సూచించారు.

కోవిడ్‌-19 ‌నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ ‌కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌శుక్రవారం సక్ష చేపట్టారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను కూడా సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ.. ’ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు.

కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్‌ ‌పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని’ అధికారు లకు సీఎం జగన్‌ ‌నిర్దేశం చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా.. తగిన సంఖ్యలో వైద్యులను నియమించండి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కానీ, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.

వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌తెలిపారు. ఈ పక్రియను అక్టోబర్‌ 1‌న మొదలు పెట్టి నవంబర్‌ 15 ‌నాటికి కార్యాచరణ పూర్తిచేసేలా ఉండాలన్నారు. కోవిడ్‌-19 ‌నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఇదిలావుంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో వ్యాకినేషన్‌ ‌కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ ‌నిర్వహించాలని ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. కోవిడ్‌ ‌ప్రోటోకాల్‌కు సంబంధించి గైడ్‌లైన్స్ ‌పై అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలన్న సీఎం, పాజిటివిటీ రేటు ఎక్కుగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగుతాయన్నారు.

కోవిడ్‌ ‌నిబంధనలును కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలని, వ్యాక్సినేషన్‌ ‌పక్రియే కోవిడ్‌ ‌సమస్యకు పరిష్కారం.. కనుక దీనిని వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సక్ష చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ఆళ్ల నాని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ‌సలహాదారు గోవిందహరి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌, ‌కోవిడ్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌కమిటీ ఛైర్మన్‌ ఎం‌టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ ‌గుల్జార్‌, 104 ‌కాల్‌ ‌సెంటర్‌ ఇం‌ఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ ‌చంద్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎం‌డీ డి మురళీధర్‌ ‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ‌రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment