పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన పరిశ్రమలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, అధికారులతో కలిసి జిల్లా టీఎస్ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎంతో అనుకూలంగా ఉందని, దీనివల్ల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తుంటారని వారికి అన్ని రకాల అర్హతలు ఉన్నట్లయితే త్వరితగతిన అనుమతించాల్సిందిగా సూచించారు. జిల్లాలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు సంబంధిత శాఖల వారు పూర్తి స్థాయిలో సహకరించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కింద అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. దీంతో పాటు జిల్లాలో ఉన్న పరిశ్రమ ప్రోత్సాహక కమిటీ ద్వారా జిల్లాలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి ఆయా శాఖల ద్వారా జారీ చేయాల్సిన అనుమతులలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటే సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలకు కావాల్సిన వివిధ అనుమతుల మంజురు యొక్క పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. అలాగే జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (14) ఎస్సీ పారిశ్రామికవేత్తకు రూ.38,72,528, (15) మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.46,13,992,  ఇద్దరు జనరల్ పారిశ్రామిక వేత్తలకు రూ.3,54,359  పెట్టుబడి రాయితీ కింద మంజూరీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఐదు (5) పరిశ్రమలకు ముడిసరుకులు అందులో  3 -బొగ్గు, 2- అల్కహాల్  మంజూరు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామికాభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచాలి జిల్లా కలెక్టర్ గౌతమ్
Comments (0)
Add Comment