- ఇదే విధంగా కొరోనా జాగ్రత్తలు పాటిస్తే మంచిది
- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొరోనా మరో ఆరు నెలల్లో అదుపులోకి వస్తోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ అన్నారు. కరోనా వైరస్ తమ అంచానాలను తలకిందులు చేసిందని..త్వరలోనే కొరోనా లేని స్థితికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కోవిడ్ మరణాలు, కేసుల సంఖ్య నియంత్రణలో ఉంటే.. మహమ్మారిని అదుపు చేయవచ్చని సుజీత్ సింగ్ అన్నారు. ‘కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ కూడా క్రమక్రమంగా బయటపడుతున్నది. వ్యాక్సినేషన్ వల్లే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం దేశంలో 75 కోట్ల మందికి టీకాలు వేశారు.
కొరోనా నియంత్రణలో టీకా ప్రభావం 70 శాతం ఉంది. దేశంలో దాదాపు 50 కోట్ల మంది రెండు డోసుల టీకీ తీసుకొని రోగనిరోధక శక్తిని పొందారు. కాగా.. ఇప్పటివరకు 30 కోట్ల మంది ప్రజలు ఒక డోస్ టీకా తీసుకున్నారు. వీరికి 30 నుంచి 31 శాతం రోగనిరోధక శక్తి లభిస్తుంది. టీకాలు వేసిన తర్వాత కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటించాలని నిపుణులు హెచ్చరించారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొరోనా బారినపడటం కేవలం 20 నుంచి 30 శాతం కేసులలోనే జరుగుతుంది. టీకా తీసుకున్న తర్వాత 70 నుంచి 100 రోజుల్లో రోగనిరోధక శక్తి తగ్గడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్లు రావడం మొదలవుతుంది.
ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ లేదు. అంతేకాకుండా.. ఆందోళన కలిగిస్తున్న అ1.2 మ్యూటెంట్ వేరియంట్లు దేశంలో కనుగొనబడలేదు. మూడో వేవ్కు మరో కొత్త రకం వేరియంట్ మాత్రమే కారణం కాదు. వచ్చే రోజుల్లో పండుగలున్నాయి కాబట్టి కొంత ఆందోళన పడాల్సిన అవసరం ఉంది’ అని సుజీత్ సింగ్ అన్నారు.