దేశంలో కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

తాజాగా 11,466 మందికి పాజిటివ్‌..460 ‌మంది మృతి
దేశంలో కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 11,466 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల్లో ఒక్కరోజులో 13 శాతం మేర పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 460 మంది కొరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,61,849కిచేరింది.

మరోవైపు దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 1,39,683కి చేరింది. యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం 264 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. పాజిటివిటీ రేటు 98.25 శాతంగా ఉంది. తాజాగా 24 గంటల్లో 11,961మంది కొరోనా నుండి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,37,87,047కి చేరింది.

corona latest updates
Comments (0)
Add Comment