ప్రజాతంత్ర, జనగామ, ఫిబ్రవరి 10 : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కెసిఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కొట్టుకున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు బీజేపీ నాయకులు అడ్డుపడతారని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.
జనగామలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆరా తీసారు. ఇదిలావుంటే సవి•కృత కలెక్టరేట్తో పాటు, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.