ఆంగ్ల విద్యా బోధనకు సవాళ్లెన్నో

ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, బహుళ జాతీయ కంపెనీలు దేశంలో తమ శాఖలను విస్తరిస్తున్న తరుణంలో ,ఉన్నత ఉద్యోగాలు పొందటానికి ఎదుర్కోవాల్సిన పోటీని తట్టుకోడానికి ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా, గ్రామీణ నేపథ్యం కల్గి ఉన్న విద్యార్థులు ఆంగ్ల పరిజ్ఞానం లేక కార్పొరేట్ ఉద్యోగాలకి దూరమవుతున్నారు. ఈ సమస్యను తొలగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో కూడా ఆంగ్ల భోదన విధానం అమలు చేయాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది.

ఈ నిర్ణయం హర్షించదగ్గదే అయినప్పటికి కొత్త విధానం సత్ఫలితాలు ఇవ్వాలంటే కావాల్సిన మౌళిక సదుపాయాలు ప్రధానంగా ఆంగ్ల మాధ్యమం లో అన్ని సబ్జెక్టు లు బోధించడానికి భారీ సంఖ్యలో తగు అర్హతలున్న బోధన సిబ్బందిని నియమించాలి. ఎందుకంటే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అత్యధిక సిబ్బంది తెలుగు మీడియం నేపథ్యం కల్గి ఉండటమే కాక, బి ఎడ్ లో కూడా వారు ఎక్కువగా మెథడాలజీ ని కూడా తెలుగులోనే చదువడం వల్ల ఆంగ్ల బోధన లో వారు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల భోదన చేపట్టాలంటే భారీ ఉపాధ్యాయ నియామకాలు స్వల్పకాలంలో చేపట్టాలంటే ప్రభుత్వానికి కత్తిమీద సాము అనే చెప్పవచ్చు. నూతన విద్యా విధానం ( నెప్ 2020 )ను కూడా అమలు చేయాలంటే ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో మౌళిక సదుపాయాలను విద్యార్ధి- ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం కల్పించాలంటే ఈ బడ్జెట్ లోనే భారీ నిధుల కేటాయింపు జరగాలి.

ఇంకో వైపు కొరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ఉపశమనం పొందనంతవరకు ఆంగ్ల భోదన కష్టమే. కొరోనా కేసులు పెరిగిన ప్రతిసారి బలయ్యేది విద్యావ్యవస్థనే . లాక్ డౌన్ లో ఆన్ లైన్ లో భోదన చేపట్టిన ప్రతిసారి గ్రామీణ బడుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఆన్ లైన్ లో ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు వినాలంటే వారికి శక్తికి మించిన పనే అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికి పరిస్థితులు అనుకూలించి, ప్రణాళిక ప్రకారం, నిధుల కేటాయింపు , నియామకాల పూర్తి సకాలం లో జరిగితే తెలంగాణ విద్యావ్యవస్థలో నవశకానికి నాంది పడ్డట్టే అవుతుంది.

ChallengesEnglish Education Teachingprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment