జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఇలాంటి మాటలా..?

  • పిచ్చోడి చేతిలో రాయిలా బండి సంజయ్‌ ‌మాటలు..
  • బీజేపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ‌మూడు ఒక్కటే : సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

రాజ్యాంగాన్ని భారత దేశానికి తీసుకొచ్చిన అంబేద్కర్‌కు, నెహ్రూ, ఆనాటి కాంగ్రెస్‌ ‌నేతలకు కృతజ్ఞతలు తెలిపారు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. రాజ్యాంగంపై అవగాహన లేని రాజకీయ నాయకుల మాటలు జుకుప్సాకరంగా ఉంన్నాయన్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్న వారు ఇంకొకరు ఏదో కుట్ర జరుగుతుందని సీఎం అంటున్నారని …ఇవన్నీ చూస్తున్న సీఎం కేసీఆర్‌ అనర్హుడని విమర్శించారు.

గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ….సర్జికల్‌ ‌స్ట్రైక్‌ అం‌టే ఏంటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాటలు వింటుంటే దారుణంగా ఉన్నయని, పిచ్చోడు చేతిలో రాయి విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాటలు ఇవేనా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడుతుంటే దేశ ప్రధాని ఏం చేస్తున్నారని …పక్క దేశాల నుండి ఇలా వొస్తుంటే ప్రధాని ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్బరుద్దీన్‌ ఓ అడుగు ముందుకేసి పీవీ, ఎన్టీఆర్‌ ‌ఘాట్‌లను కూలుస్తా అంటున్నారని, రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ఫైర్‌ అయ్యారు.

ambedkarbjpCLP leader Mallu Bhatti VikramarkamimNehrutrs
Comments (0)
Add Comment