జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలన్న రివ్యూ పిటిషన్ను సుప్రీమ్కోర్టు కొట్టేసింది. పరీక్షలను యథావిధిగానే నిర్వహించాలని సూచించింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని సుప్రీమ్కోర్టులో 6 రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ను దాఖలు చేశాయి. ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో నీట్, జేఈఈ పరీక్షలు యథాతథంగా
కొనసాగనున్నాయి. ఆగస్టు 17న సుప్రీమ్కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసక్షించాలని రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని కోర్టును కోరారు. కానీ ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం విదితమే.
పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు సంయుక్తంగా ఆగస్టు 28న సుప్రీమ్కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొరోనా మహమ్మారి, మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల తమ తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ఆరు రాష్టాల్ర ముంత్రులు సుప్రీమ్ కోర్టును అభ్యర్థించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను ఆగస్టు 17న సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. ఈ తీర్పును పునఃసక్షించాలని ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కోర్టులో రివ్యూ పిటిషన్ను దాఖలు చేశాయి. ఆ పిటిషన్ను కూడా కోర్టు శుక్రవారం కొట్టేసింది.