ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి
ఖమ్మం,ప్రజాతంత్ర,మే07: అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి వోటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జెడ్పీసెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం రోడ్ షో నిర్వహించారు.
మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి, అభ్యర్థి ఆర్ఆర్ఆర్ పాల్గొన్న ఈ రోడ్ షోలో వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…! అక్కడ భద్రాచలంలో శ్రీ రాముడు… ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు… అలాంటి రఘురాముడికి వోటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అందరికీ “గుర్తుం”ది…! కదా…మే 13..! ఆ రోజు ఈవీఎంలో మూడో నెంబర్ హస్తం గుర్తుకు వేయండి. వోటు వేయడం మన బాధ్యత… మన హక్కు…. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.