‘‘షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఉగాది రోజు నాలుగు సార్లు ఒక్కోసారి ఆరు గంటల నిడివి వదిలి ఒక చిన్న కప్పు తింటే ఆ పచ్చడి తిన్న ఫలితం ఆ సంవత్సరం మొత్తం ఉంటుంది. ’’
తెలుగు సంవత్సరంలోని హిందూ చాంద్రమాన క్యాలెండర్ లో చైత్రమాసంలో వచ్చే మొదటి రోజున ‘‘ఉగాది’’ పండుగ జరుపుకుంటాం. హిందువులకు ఉగాది పండుగతోనే కొత్త పంచాంగం మొదలవుతుంది. ఈ సంవత్సరం ఉగాది మార్చి 22న శ్రీ శోభకృతు నామ సంవత్సర ఉగాదిగా జరుపు కుంటున్నం.ఉగాది అంటే ఉగస్త్య ఆది అని అర్థం ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. ఆది అనగా మొదలు, ప్రారంభం అని అర్థం. అంటే ప్రపంచం యొక్క జన్మ, ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. మరొక విధంగా చూస్తే ఒక సంవత్సరం రెండు అర్థ భాగాలుగా విభజించబడుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం అని అంటే రెండు ఆయనాల సంయుతం యుగం కాగా యుగానికి అంటే సంవత్సరానికి ఆది ఉగాది అయింది. అదే సంవత్సరాది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభ మవుతాయి. తెలుగుదనం ఉట్టిపడేలా పండుగను జరుపుకు ంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలలో ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఉగాది పండుగను వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు ఏ పేరుతో పిలిచినా ఈ పండుగను పెద్ద తేడాలు ఏమీ లేవు అని చెప్పవచ్చు.మహారాష్ట్రలో గుడి పడ్వా ,, కేరళలో విషు,, తమిళనాడులో పుత్తాండు,, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ , పంజాబ్ లో బైసాఖి, అస్సాంలో రోంగాలి బిహు అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకోవడం విశేషం..షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు.
జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఉగాది రోజు నాలుగు సార్లు ఒక్కోసారి ఆరు గంటల నిడివి వదిలి ఒక చిన్న కప్పు తింటే ఆ పచ్చడి తిన్న ఫలితం ఆ సంవత్సరం మొత్తం ఉంటుంది.పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో వేసే పదార్థాలలో వేప పువ్వు పాలు కొంచెం ఎక్కువగా ఉండేలా చూడాలి. కారణ మేమనగా ఆ మాసంలో మాత్రమే దొరికే ఈ వేప పువ్వు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరు తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు.
ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రత్యేకగా నిలుస్తుంది.
షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి..
తీపి : బెల్లం : ఆనందానికి సంకేతం
ఉప్పు : జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
చేదు : వేప పువ్వు : బాధకలిగించే అనుభవాలు
పులుపు : చింతపండు : నేర్పుగా వ్యవహరించవలసిన
పరిస్థితులు
వగరు : పచ్చి మామిడి ముక్కలు : కొత్త సవాళ్లు
కారం : మిరపపొడి : సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
ఇతర పండుగలు, వ్రతాల మాదిరిగా ఉగాది ఏదో ఒక దేవుడినో, దేవతనో, ఉద్దేశించి చేసుకొనేది కాదు. అనంతమైన కాలాన్ని మన వీలుకొద్ది సంవత్సరంగా లెక్కించి సకలదేవతా స్వరూపంగా భావించి ఆచరిస్తున్నాం.ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ఏదో ఒక కాలానుగుణంతో తమ సంప్రదాయానుగుణంగా, ‘’సంవత్సరాది’’ నీ జరుపుకుంటాం, ఆచరించే విధానంలో తేడాలు ఉన్న ఆశయం, ఆనందాలు ఒకటే, కంటికి కనిపించని కాలస్వరూపం తానేనని ‘కాలః కాలాయితా మహమ్’ అని అన్నారు గీతాచార్యుడు. తాను కాలాన్ని అని చెప్పుకున్న, ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రుల గమనాలనే కాల నిర్ణయానికి ప్రామాణికంగా తీసుకుంటారు.. ‘రుతునాం కుసుమాకరః’ (ఋతువుల్లో వసంతాన్ని) అన్న భగవానుడి మాటలను బట్టే వసంతరుతువుకు దాని ఆరంభం పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం విషదమవుతుంది, ఈరోజు (ఉగాది) నూతన సంవత్సరానికి ఆరంభం కనుక ‘’సంవత్సరాది’’ అని వ్యవహరిస్తాం ఇది తెలుగువారి తొలి పండుగ.
చాంద్రమానం రిత్య ఇది సర్వప్రదమైన రోజు..
ఉగాదికి సంబంధించిన వేర్వేరు కథనాలు పురాణాల్లో చెప్పబడిన ప్రకారం వేదాలను సోమకుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో దాచి పెట్టాడు. అప్పుడు విష్ణువు మత్స్యవతారం ధరించి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. ఆ శుభ తరుణానికి పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చింది.చైత్ర శుద్ధ పాడ్యమినాడు విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపబడుతుందని చెప్పవచ్చు.మరొక చారిత్రక వృత్తాంతం ప్రకారం శాలివాహన చక్రవర్తి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు పట్టాభిశక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగ కర్తగా బాసిల్లున కారణం వల్ల ఆ యోధుని గుర్తు గా ఉగాది ఆచరింపబడుతుంది.
కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి జరుపుకునే పండుగల్లో మొదటి పండుగ ఉగాది.
శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు……..
-స్వప్న కొండ..
పి.జి.టి తెలుగు, ఉపాధ్యాయురాలు…
జ్యోతీబాపూలే బిసి గురుకుల బాలుర పాఠశాల,
సికింద్రాబాద్ కంటోన్మెంట్,