- త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశాలు
- సూపర్నెంట్పై చర్యలు తీసుకుంటామన్న మంత్రి ఆళ్ల నాని
అమరావతి,జూన్ 4 : వైద్య విద్యార్థినిపై నెల్లూరు జీజీహెచ్ సూపరిండెంట్ లైంగిక వేధింపులపై విచారణ జరుపుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆళ్ల నాని తెలిపారు. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటా మన్నారు. జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందన్నారు. పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని అదేశించామన్నారు. ఘటనపై విచారణ కోసం కమిటీని నియమించి విచారణ జరుపుతామన్నారు. కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.
సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోణలపై విచారణ జరిపి..సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఒకటి డీఎంఈ తరపున ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ.. మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ.
జిల్లా కమిటీలో జెడ్పీ సీఈవో , ఐసీడీఎస్ పీడీ, జాయింట్ కలెక్టర్ తో త్రిసభ్యులు ఉంటారు. డీఎంఈ తరపు కమిటీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తే.. డిస్టిక్్రకమిటీ బయటనుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి డీఎంఈ కమిటీ కానీ, డిస్టిక్్రకమిటీ కానీ దీన్ని సుమోటోగా తీసుకుంటుంది. 24 గంటల్లో డిస్టిక్్ర కమిటీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవు.