- సింహం సింగిల్గానే వస్తుంది
- మరోమారు విపక్షాలపై జగన్ మండిపాటు
- గతంలో పనిచేసిన ముసలాయన అంటూ బాబుపై విమర్శలు
- వినుకొండలో జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల
పల్నాడు,జనవరి30 : తోడేళ్లన్నీ కలసి వస్తున్నాయని..అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ ఘాటుగా విమర్శించారు. విపక్షాల తీరుపై సిఎం జగన్ విమర్శలు గుప్పించారు. వినుకొండలో జరిగిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. ‘గతంలో సీఎం పదవిలో ఒక ముసలాయనను చూశాం. గత ప్రభుత్వ హయాంలో బటన్ నొక్కి డబ్బులెందుకు వేయలేదు? అప్పుడు, ఇప్పుడు ఉన్నది కూడా ఒకే రాష్ట్రం, ఒకే బడ్జెట్. ఆ ముసలాయన ప్రభుత్వంలో తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారు ముసలాయన ప్రభుత్వంలో గజదొంగల ముఠా ఉండేది. దోచుకో.. పంచుకో.. తినుకో అనేలా గత ప్రభుత్వ పాలన ఉందని చంద్రబాబను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.. రాష్ట్రంలో తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. సింహంలా బిడ్డ ఒక్కడే వస్తున్నాడు. ప్రజల అండ ఉన్నంతవరకూ నన్ను ఎవరేం చేయలేరని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ది పొందుతున్నారు. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేశారు. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు సీఎం జగన్. వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చామని.. చేసి చూపించామన్నారు. ఈ మూడేళ్లలో ప్రతి సంక్షేమ పథకం రాష్ట్రం లోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు. ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చామన్నారు. అర్హత ఉంటే చాలు లంచాలకు తావులేకుండా ఆర్థిక సాయం అందుతోందన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా, పారదర్శకంగా పథకాలను అందజేస్తున్నామని జగన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు చేస్తున్నామని.. ఇప్పటి వరకు నేరుగా 1.92 లక్షల కోట్లు అందించామన్నారు. ఎపీలో దేశంలోనే జీడీపీ జీఎస్డీపీ ప్రకారం గ్రోత్ రేట్ 11.43 శాతంతో మొదటి స్థానంలో ఉందన్నారు.
దేశానికే ఆదర్శంగా జీడీపీ పరిగెడుతోందని.. వీటిని పట్టించుకోకుండా కొందరు గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పిలుపు ఇచ్చారు. రైతులు, అక్కాచెల్లెమ్మలకు సంక్షేమ పథకాల ద్వారా చేయూత అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో తోడేళ్లంతా ఒకటయ్యాయని.. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం. ’సింహంలా బిడ్డ ఒక్కడై వస్తున్నాడు’.. అన్నారు. గతంలో ఒక ముసలాయ ముఖ్యమంత్రిని చూశామని.. గతంలో ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలో పాలనలో ఏం జరుగుతుందో గమనించాలని.. గత పాలనలో గజదొంగల ముఠా ఉండేదని.. వాళ్లది దోచుకో పంచుకో తినుకో వాళ్ల పాలసీ అన్నారు. ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని వ్యాఖ్యానించారు. అలాగే వినుకొండ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రూ.10 కోట్లతో మైనార్టీ కాలేజీ ఏర్పాటు చేస్తామని.. అలాగే రూ.15 కోట్లతో 100పడకల ఆస్పత్రి నిర్మిస్తామని.. బొల్లాపల్లి మండలంలో తాగునీటి పథకానికి రూ.60 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శిం చారు. ఒకవేళ డబ్బులు రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందుటుం దన్నారు. వినుకొండలో సీఎం జగన్ పర్యటించారు. జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయాన్ని అర్హులకు అందజేశారు.
మూడేళ్లలో జగనన్న చేదోడు కింద రూ.927.51 కోట్లు అందించామన్నారు. దేశానికే దిక్సూచిగా ఏపీ నిలుస్తోందని సీఎం జగన్ అన్నారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హాని అమలు చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను చేర్చామన్నారు. అమ్మ ఒడి, సున్నా వడ్డి, ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. 11.43 శాతం వృద్ధిరేటుతో ఏపీ ముందు కెళ్తోందన్నారు. గిట్టని వాళ్లు ఏపీ శ్రీలంకలా అవుతుందంటూ దుష్పచ్రారం చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులకంటే మేం తక్కువే చేశామన్నారు. మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని తదితరులు పాల్గొన్నారు.