అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
సిఎం అధికార నివాసం ప్రగతి భవన్ను ముట్టడించడానికి అదిలాబాద్ రైతులు యత్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం వాటా కింద రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఈ ముట్టడి నిర్వహించారు. సెక్యూరిటీని దాటుకొని ప్రగతిభవన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ప్రగతిభవన్ ఎదుట కాసేపు ఉద్రిక్త•త నెలకొంది. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీయగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.