డిమండ్ చేస్తూ ట్రాక్టర్పై పార్లమెంట్కు రాహుల్ గాంధీ
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన సోమవారం పార్లమెంట్కు ట్రాక్టర్పై వొచ్చారు. రైతుల సందేశాలను పార్లమెంట్కు మోసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రైతు గొంతును ప్రభుత్వం నొక్కిపెడుతుందని ఆరోపించారు. పార్లమెంట్లో రైతు చట్టాలపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.
ఆ నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. కొత్త సాగు చట్టాలు కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 8 నెటటుగా ఢిల్లీలో రైతుల ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే.