Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి  పరిశీలనకై.. మాల్దీవుల నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం రాక

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు  మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం నేడు హైదరాబాద్‌ ‌కు చేరుకున్నది. ఈ జర్నలిస్టుల బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది.  హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌, ‌రెడ్డి ల్యాబ్స్, ‌టి హబ్‌ ‌లతోపాటు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ రోజు ఉదయం శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో జర్నలిస్టు బృందానికి సమాచార శాఖ,  జాయింట్‌ ‌డైరెక్టర్‌, ‌ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి నాగుళ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.

Leave a Reply