Take a fresh look at your lifestyle.

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

  • అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే
  • రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ
  • తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా
  • ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు
  • దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌
  • ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వొస్తుందేమోనని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వొస్తాయన్నారు. దేశంలో అంబేద్కర్‌ ‌రాజ్యాంగం అమలు కావడం లేదు.. మోదీ రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌ ‌దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్‌ ‌సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపామని కేటీఆర్‌ ‌తెలిపారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున సంపూర్ణగా మద్దతు ప్రకటించామని అన్నారు. యశ్వంత్‌ ‌సిన్హాను హైదరాబాద్‌ ‌రావాలని ఆహ్వానించామని, హైదరాబాద్‌లో తమ ఎంపీలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తుందని, నిరంకుశ విధానాలతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. గత 8 ఏండ్ల నుంచి ఆయా రాష్టాల్రకు అన్యాయం చేస్తున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేకపోయినా ఆయా ప్రభుత్వాలను తలకిందులు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకొని విపక్షాల వి•ద వేటకుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని ప్రధాని మోదీపై కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా, అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతు ఇస్తున్నామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతివ్వాలని ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్‌ ‌సిన్హా గెలువాలని, రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా మాకు ఇబ్బంది లేదని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఆవిడ మంచి వ్యక్తే కావొచ్చు. గిరిజన, మహిళా అభ్యర్థిని చెప్పడం సరికాదు. జనవరి 2, 2006లో ఒడిశాలో కళింగనగర్‌లో స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌వద్ద ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను కాల్చి చంపారు. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ద్రౌపది నాడు మంత్రి కూడా. నాడు ఆమె ఎలాంటి సానుభూతి తెలుపలేదు. గిరిజనులకు అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్డ్ ‌తెగల రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నాం. ఒక వేళ నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు చేసి ఉండాలి. కానీ ఉలుకు పలుకు లేదు. ట్రైబల్‌ ‌యూనివర్సిటీ పెడుతామని పునర్విభజన చట్టంలో చెప్పారు. ఈ రోజు వరకు అతీగతీ లేదు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. బీజేపీ వ్యవహారం దేశంలోని గిరిజనులకు, తెలంగాణలోని గిరిజనులకు బాగా తెలుసు. చిత్తశుద్ధి ఉంటే ట్రైబల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లను పెంచాలి. ఏడు మండలాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాకు టీఆర్‌ఎస్‌ ‌మద్దతు ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీకి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరుతో బీజేపీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షాల కూటమిలో ఉన్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థికి తాము మద్దతిచ్చామన్నారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని చాలా సార్లు కేంద్రాన్ని కోరామని చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల మీద తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలన్నారు. గిరిజన వర్శిటీ ఇప్పటి వరకు లేదన్నారు. బీజేపీకి కేసీఆర్‌ ‌బొమ్మ తప్ప వేరే దిక్కులేదన్నారు. మోడీ ఫోటోకు చెప్పులేసి గాడిద మీద ఊరేగించగలం కానీ అలా చేయబోమన్నారు. మోడీ మూడు సార్లు సీఎం అయినా గుజరాత్‌లో ఇంతవరకు కరెంట్‌ ‌లేదన్నారు. ద్రౌపది ముర్ము సొంత గ్రామానికే ఇప్పుడు కరెంట్‌ ఇస్తున్నారన్నారు. అందరికి విద్యుత్‌ ‌సౌకర్యం ఇచ్చామన్న మోడీ మాటలు అబద్ధమన్నారు. రాజ్యాంగాన్ని కాలరాసి మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే జుమ్లా..లేకుంటే హమ్లా మోడీ ఫార్ములా అని అన్నారు. తెలంగాణ నుంచే ధిక్కార స్వరం వినిపించి దేశాన్ని చైతన్యం చేయొచ్చాన్నారు. మోడీ 8 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏం లేదన్నారు. బీజేపీ కంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా టీఆర్‌ఎస్‌ ‌కు ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన దాని కంటే కేంద్ర ఒక్క పైసా ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానన్నారు. రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌రాష్ట్రపతి అయ్యాక దళితుల బతుకులు ఏమైనా మారిపోయాయా అని ప్రశ్నించారు. విషం చిమ్ముడు తప్ప బీజేపీ నాయకుల దగ్గర విషయం లేదన్నారు. వి•డియా సమావేశంలో ఎంపిలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, రంజిత్‌ ‌రెడ్డి, బిబి పాటిల్‌,‌రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply