బైలదిల్లా కోసం విశాఖను నష్టాల్లోకి నెట్టారు
బయ్యారం ఉక్కు సాధ్యం కాదని నివేదిక ఇచ్చారు
విభజన హాల్లో కడప, బయ్యారంలను విస్మరించారు
ఆత్మీయ ఆదానీ కోసం మోదీ వ్యాపార ఎత్తులు
దమ్ముంటే బైలదిల్లా ఒప్పందాలను రద్దు చేయాలి
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే విశాఖపై స్టడీ
డియా సమావేశంలో వెల్లడించిన మంత్రి కెటిఆర్
25న నియోజకవర్గ స్థాయిలో బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
27న పార్టీ కార్యాలయంలో కెసిఆర్ ఆధ్వర్యంలో సభ
ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన డియాతో మాట్లాడారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసి.. పలు అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుపుతామని వెల్లడించారు. 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలపై సావధానంగా చర్చిస్తారని తెలిపారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించడం జరుగుతుందని చెప్పారు. ’ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించాం. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేశాం. ఇవి చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వొచ్చిన చిన్న ఇబ్బందులను కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తామని తెలిపారు.